డ్రైనేజ్ పక్కనున్న గోడనుంచి 10 అడుగుల సొరంగం తవ్వి.. నగల దుకాణంలో చోరీ...
మంగళవారం ఉదయం మీరట్ లోని ఓ నగల దుకాణంలో ఛోరీ కేసు వెలుగు చూసింది. డ్రైనేజ్ పక్కనున్న గోడనుంచి 10 అడుగుల మేర సొరంగం తవ్వి మరీ దొంగతనానికి పాల్పడ్డారు.
ఉత్తర్ ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని ఓ దుకాణంలో దొంగలు 10 అడుగుల సొరంగాన్ని డ్రెయిన్ ద్వారా తవ్వి లక్షల రూపాయల విలువైన ఆభరణాలను అపహరించారు. మంగళవారం ఉదయం రోజూలాగే జ్యువెలరీ షోరూం యజమాని దుకాణాన్ని తెరిచేందుకు రాగా, డ్రెయిన్ గుండా షాపులోకి సొరంగం వెళ్లడాన్ని గమనించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దొంగలు దుకాణంలోకి ప్రవేశించడానికి డ్రైన్ పక్కలున్న బలహీనమైన గోడల నుంచి ఇటుకలు, మట్టిని తవ్వారు.
అలా నగల దుకాణంలోకి ప్రవేశించి.. లక్షలాది రూపాయల నగలతో దొంగలు పారిపోయారని, అయితే ఎంత విలువైన ఆభరణాలు అనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ దోపిడీ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీరట్ బులియన్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని నిరసిస్తూ షోరూమ్కు చేరుకున్నారు. నగరంలో ఇలాంటి దోపిడీ ఘటన ఇది నాలుగోసారి అని వ్యాపారులు ఆరోపించారు.
ఉచితంగానే యూపీఐ పేమెంట్స్.. ప్రతి నెలా 80 లక్షల లావాదేవీలు.. : ఎన్పీసీఐ
ఈ విషయం తెలిసిన వెంటనే ఇద్దరు పోలీసు అధికారులు షోరూమ్కు చేరుకున్నారు. వ్యాపారులు పోలీసు అధికారులను దుకాణంలోకి ప్రవేశించడానికి నిరాకరించారు, ఈ దోపిడీని, ఇటీవలి వారాల్లో వచ్చిన అనేక ఇతర అంశాలను విచారించడానికి సీనియర్ అధికారులు హాజరు కావాలని డిమాండ్ చేశారు. దొంగలను పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.