Asianet News TeluguAsianet News Telugu

రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: తెలంగాణలో కారుదే జోరు, కాంగ్రెస్ బేజారు

 తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ జోరు కొనసాగనుందని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. 

Trs will get majority mp seats in telangana in 2019 loksabha elections
Author
Hyderabad, First Published Apr 9, 2019, 10:59 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ జోరు కొనసాగనుందని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కదని ఈ సర్వే నివేదికలు చెబుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకొంటుందని ఈ సంస్థ ప్రకటించింది. టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కూడ హైద్రాబాద్ స్థానంలో జయకేతనం ఎగురవేయనున్నట్టు ఆ సంస్థ తేల్చి చెప్పింది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 88 అసెంబ్లీ స్తానాల్లో టీఆర్ఎస్  గెలిచింది. అదే రీతిలో ఎంపీ ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్ ఘన విజయం సాధించనున్నట్టు ఈ సంస్థ అభిప్రాయపడింది. 42.8 శాతం ఓట్లతో టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉందని ఆ సంస్థ  ప్రకటించింది.

తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలకు దక్కించుకొనే వ్యూహంతో కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సర్వేలో కూడ కేసీఆర్ అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాయి.  టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం‌కు 3 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. హైద్రాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం అభ్యర్ధి అసదుద్దీన్ ఓవైసీ గెలుపు నల్లేరుపై నడకేనని ఈ సర్వే తేల్చింది.

ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి 33.4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సీ ఓటర్ సర్వే ప్రకటించింది. అయితే ఒక్క ఎంపీ స్థానం నుండి  ఆ పార్టీకి దక్కదని తేల్చి చెప్పింది. కొన్ని కీలకమైన ఎంపీ స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని  ఆ పార్టీ నేతలు ఆశతో ఉన్నారు. కానీ  ఈ సర్వే ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి.

బీజేపీకి 14.7 శాతం ఓట్లు దక్కనున్నాయి. కానీ ఒక్క ఎంపీ సీటు కూడ  బీజేపీకి రాదని ఈ సర్వే తేల్చి చెప్పింది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా సికింద్రాబాద్ ఎంపీ స్థానంతో పాటు 5 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

తెలంగాణలో పోటీలో ఉన్న జనసేన సహా ఇతర పార్టీలకు ఒక్క సీటు కూడ రాదని  ఈ సర్వే స్పష్టం చేసింది. కానీ, ఇతరులకు 6.2 శాతం ఓట్లు దక్కనున్నాయని ఆ సంస్థ తన సర్వే రిపోర్టులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: జగన్‌పై చంద్రబాబుదే పైచేయి

రూరల్ మీడియా సర్వే: చంద్రబాబు వర్సెస్ జగన్, ప్లస్ లూ, మైనస్‌లూ

రూరల్ మీడియా సర్వే: ఏపీలో జిల్లాల వారీగా పార్టీలకు వచ్చే సీట్లివే

సర్వే: మెజారిటీ ఎంపీ సీట్లు బాబుకే, జగన్‌కు 9 సీట్లే

అసెంబ్లీ ఎన్నికల సర్వే: బాబుదే పై చేయి, వెనుకంజలో జగన్, పవన్ జీరో

తాజా సర్వే: జగన్‌దే హవా, పవన్ నామమాత్రమే

Follow Us:
Download App:
  • android
  • ios