Asianet News TeluguAsianet News Telugu

ఈవీఎంలపై రాహుల్ ఆరోపణల్లో అంతరార్ధమేమిటి?

కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఈవీఎం‌లతో పాటు, ఎన్నికల షెడ్యూల్‌ను కూడ ప్రభావితం  చేశారని  విమర్శలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ వెలువడడానికి కొన్ని క్షణాల ముందే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Rahul gandhi controversy statmements on evms
Author
New Delhi, First Published May 19, 2019, 9:30 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఈవీఎం‌లతో పాటు, ఎన్నికల షెడ్యూల్‌ను కూడ ప్రభావితం  చేశారని  విమర్శలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ వెలువడడానికి కొన్ని క్షణాల ముందే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

ఏడు విడతల ఎన్నికలు ఆదివారం నాడు పూర్తయ్యాయి. తుది విడత పోలింగ్ ముగిసిన వెంటనే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌లో ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించాయి. యూపీఏకు తక్కువ సీట్లు వస్తాయని అన్ని సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎలక్టోరల్ బాండ్‌ , ఈవీఎం‌లతో పాటు ఎన్నికల షెడ్యూల్‌ను కూడ మోడీ ప్రభావితం చేశారని  రాహుల్ విమర్శించారు. నమోటీవీ, మోడీ ఆర్మీని కూడ మోడీ తనకు అనుకూలంగా ఉపయోగించుకొన్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేదార్‌నాథ్‌లో పూజలు అంటూ మోడీ డ్రామాలు ఆడుతున్నారని రాహుల్ విమర్శలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios