Asianet News TeluguAsianet News Telugu

పోస్టల్ బ్యాలెట్‌లో దూసుకుపోతున్న ఎన్డీయే అభ్యర్థులు

దేశ వ్యాప్తంగా  ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఆదిక్యంలో కొనసాగుతోంది.  బుధవారం నాడు ఉదయం దేశ వ్యాప్తంగా 542 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి

nda candidates lead in postal ballot counting
Author
New Delhi, First Published May 23, 2019, 8:22 AM IST

న్యూఢిల్లీ:  దేశ వ్యాప్తంగా  ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఆదిక్యంలో కొనసాగుతోంది.  బుధవారం నాడు ఉదయం దేశ వ్యాప్తంగా 542 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో   పోస్టల్ బ్యాలెట్‌లో ఎన్డీయే  అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు.

కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే తొలుత పోస్టల్ బ్యాలెట్‌‌లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లలో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. దేశంలోని 542 లోకసభ స్థానాలకు ఏడు విడతల పోలింగ్ జరిగింది. చివరి విడత ఈ నెల 19వ తేదీన జరిగింది. బిజెపి, కాంగ్రెసు పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios