Asianet News TeluguAsianet News Telugu

రాహుల్‌కు ఈసీ నోటీసుషాక్: 24 గంటల్లో వివరణ ఇవ్వాలి

కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.

Ec issues notice to rahul over nyay poster in amethi
Author
New Delhi, First Published Apr 19, 2019, 5:35 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ నియోజకవర్గంలో న్యాయ్ పథకానికి సంబంధించిన పోస్టర్ ఏర్పాటు చేశారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఈసీ అభిప్రాయపడింది.

ఆమేథీలోని ఓ ఇంటి యజమాని అనుమతి లేకుండానే ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేయడం ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తోందని ఈసీ చెబుతోంది.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని 24 గంటల్లో వివరణ ఇవ్వాలని  ఈసీ ఆదేశించింది. 

కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల సమయంలో  ప్రతి ఏటా పేదలకు రూ.72 వేలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రతి నెల ఒక్కో పేద కుటుంబానికి రూ. 12 వేలను ఇస్తామని రాహుల్ ప్రకటించారు.

దేశంలోని 20 శాతం పేదలకు ఈ పథకం కింద లబ్ది చేకూర్చనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడ ఈ అంశాన్ని చేర్చింది.పేదరికంపై న్యాయ్ పథకం సర్జికల్ స్ట్రైక్ వంటిదని  రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభల్లో  ప్రకటించిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios