ఫేస్బుక్ పేజి బ్లాక్: జేడీఎస్ పనే, కుమారస్వామిపై భగ్గుమన్న సుమలత
సుమలత ఫేస్బుక్ పేజ్ బ్లాక్ అయ్యింది. దీంతో ఆమె మళ్లీ కొత్త ఖాతాను ప్రారంభించారు. తన కొత్త ఫేస్బుక్ ఖాతా లింక్ను షేర్ చేస్తూ...సుమలత ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ట్వీట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కుమారస్వామిపై విరుచుకుపడ్డారు
మాండ్య లోక్సభ స్థానానికి సంబంధించి కన్నడనాట రాజకీయాలు హాట్ హాట్గా మారిపోతున్నాయి. ఈ స్థానం నుంచి దివంగత అంబరీష్ భార్య, సినీనటి సుమలత, ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ గౌడ పోటీకి దిగడంతో అక్కడ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.
రోజూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. తాజాగా సుమలత ఫేస్బుక్ పేజ్ బ్లాక్ అయ్యింది. దీంతో ఆమె మళ్లీ కొత్త ఖాతాను ప్రారంభించారు. తన కొత్త ఫేస్బుక్ ఖాతా లింక్ను షేర్ చేస్తూ...సుమలత ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆమె ట్వీట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కుమారస్వామిపై విరుచుకుపడ్డారు. జేడీఎస్ నేతలు కుళ్లు రాజకీయాలు చేసి, తన ఖాతాను డిలీట్ చేశారని సుమలత పేర్కొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు నా ఫేస్బుక్ను హ్యాక్ చేసి బ్లాక్ చేశారని... ఫేస్బుక్ వేదికగా తాను మాండ్య ప్రజలతో మాట్లాడేదాన్నని, నా ప్రణాళికలు వారితో పంచుకునేదాన్నని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఫేస్బుక్ పేజీని పునరుద్దరించడానికి తమ సాంకేతిక బృందం కృషి చేస్తోందని.. ఎన్నికల సమయంలో ఇలాంటి చెత్త పనులతో ప్రజల్ని ఫూల్స్ చేసి వారిని తప్పుదారి పట్టించలేరన్నారు. జేడీఎస్ ఎంత భయంకరమైనదో ఈ సంఘటన ద్వారా నిరూపించబడింది.. చెత్త రాజకీయాలంటూ సుమలత ట్వీట్ చేశారు.
Unknown miscreants have taken control and blocked my Social Media Contents Page on Facebook through which I was trumpeting the truth and my plans for people of Mandya
— sumalatha ambareesh 🇮🇳 (@sumalathaA) April 15, 2019
Our dynamic technical team is working vigorously to restore the page and contents as soon as possible pic.twitter.com/D9tDbRIDNb
This just proves how scared your party is @hd_kumaraswamy
— sumalatha ambareesh 🇮🇳 (@sumalathaA) April 15, 2019
Politics at its worst https://t.co/q6V54CEpb5