ప్రేమ పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకర్నొకరు మోసం చేసుకునే సంఘటనలు ఎన్నో చూశాం. కానీ ఈ మోసం గతంలో మీరు ఎప్పుడూ విననిది, కననిది. 

ప్రేమలో మోసం చేసే కేసులు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఇక్కడ ఒక తెలివైన అమ్మాయి తనకు గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఉందని చెప్పి బాయ్‌ఫ్రెండ్ దగ్గర 28 లక్షలు తీసుకుంది. ఆ డబ్బుతో వక్షోజాల పరిమాణం పెంచుకుంది. ఇప్పుడు ఈ విషయం బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 35 ఏళ్ల లౌరా మెక్‌ఫెర్సన్ అనే మహిళ లండన్‌లో ఈ పని చేసింది. ఆమెకు 12 ఏళ్ల కూతురు ఉంది. చాలా సంవత్సరాలుగా జాన్ లియోనార్డ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందామె. జాన్ ఒక ఛారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాడు. లౌరా తన అందంతో అతన్ని బుట్టలో వేసుకుంది. రిలేషన్‌షిప్‌ కొన్నాళ్లు బాగానే సాగాక, గర్భాశయ క్యాన్సర్ ఉందని జాన్‌కు చెప్పి లౌరా దూరంగా ఉండసాగింది.  క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు చాలా డబ్బు ఖర్చవుతుందని, తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది. తల్లడిల్లిపోయిన జాన్ ధైర్యం చెప్పి ట్రీట్‌మెంట్‌కు సహాయం చేస్తానని అన్నాడు. లౌరాకు ఇదే కావాలి. క్యాన్సర్ ట్రీట్‌మెంట్,  కీమోథెరపీ అంటూ మొత్తం రూ.28 లక్షలు తీసుకుంది. మళ్లీ డబ్బు అడగడానికి రెడీ అయింది. లౌరా త్వరగా కోలుకోవాలని జాన్ ఆమెకు దగ్గరలోని హాస్పిటల్‌లో కీమోథెరపీతో సహా అన్నీ బుక్ చేశాడు. కానీ ఆమె డబ్బు తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లి బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి, పొట్ట తగ్గించుకోవడానికి సర్జరీలు చేయించుకుంది. జాన్ ట్రీట్‌మెంట్ ఎలా జరుగుతోందని తెలుసుకోవడానికి హాస్పిటల్‌కు ఫోన్ చేశాడు. అప్పుడు ఆమె క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకోలేదని, బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి సర్జరీ చేయించుకుందని తెలిసింది. దీంతో విషయం బయట పడింది. జాన్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టు ఈ కేసును విచారించి లౌరాను దోషిగా తేల్చింది. ఆమె ఒక మోసగత్తె అని, బాయ్‌ఫ్రెండ్‌నే కాకుండా కుటుంబ సభ్యులను, కూతుర్ని కూడా మోసం చేసిందని కోర్టు చెప్పింది.