ఖో ఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 ఛాంపియ‌న్ గా భార‌త్.. చ‌రిత్ర సృష్టించిన భార‌త మ‌హిళ‌లు

Kho Kho World Cup 2025 Final: ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి ఖోఖో ప్ర‌పంచ క‌ప్ 2025 లో భార‌త్ చ‌రిత్ర సృష్టించింది.  భారత మహిళల జట్టు ఫైన‌ల్ లో నేపాల్ ను చిత్తు చేసి ఛాంపియ‌న్ గా నిలిచింది. 
 

India becomes Kho Kho World Cup 2025 champion.. Indian women create history RMA

Kho Kho World Cup 2025 Final: భార‌త ఖోఖో మ‌హిళల జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొడుతూ ఖోఖో ప్ర‌పంచ క‌ప్ 2025 ఛాంపియ‌న్ గా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి ఒక్క ఓట‌మి లేకుండా భార‌త్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో తొలి ఖోఖో ప్ర‌పంచ క‌ప్ టైటిల్ ను గెలుచుకుంది. 

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం (జనవరి 19)మహిళల జ‌ట్టు ఫైన‌ల్ మ్యాచ్ లో నేపాల్ తో త‌ల‌ప‌డింది. ఖోఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్ ఫైన‌ల్ లో దుమ్మురేపే ప్ర‌ద‌ర్శ‌న‌తో నేపాల్ ను చిత్తు చేసింది.

ఆదివారం జరిగిన మొట్టమొదటి ఖో ఖో ప్రపంచ కప్‌ను 78-40 తేడాతో భార‌త్ గెలుచుకుంది. టోర్నీ మొద‌లైన త‌ర్వాత భార‌త్ లీగ్ ద‌శ నుంచి ఫైన‌ల్ వ‌ర‌కు ఒక్క ఓట‌మి లేకుండా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ప్రియాంక ఇంగ్లే నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు నేపాల్ ను చిత్తు చేసి ఛాంపియ‌న్ గా నిలిచింది.

 

 

 

 

నేపాల్ టాస్ గెలిచి, మొదట భారత్‌ను అటాక్ కు ఆహ్వానించింది. ఇదే నేపాల్ ను దెబ్బ‌కొట్టింది. ఎందుకంటే ఆతిథ్య జట్టు పాయింట్లను ర్యాక్ చేసే అవకాశాన్ని, ప్రత్యర్థులపై ఒత్తిడిని తీసుకువ‌చ్చే అవ‌కాశాన్ని కోల్పోయింది.

నేపాల్ నుండి మొదటి బ్యాచ్ డిఫెండర్లను సరస్వతీ, పూజ, దీప - కేవలం 50 సెకన్లలో టర్న్ 1 ను అద్భుత ఆరంభం అందించారు. నేపాల్‌కు చెందిన పూనం, నిషా, మన్మతి వేగాన్ని తగ్గించే పనిలో ఉన్నారు. అయినప్పటికీ జోష్ మీదున్న భారతీయ మహిళలు నేపాల్ పై అటాక్ ను మ‌రింత పెంచారు. 34-0 ఆధిక్యంతో ట‌ర్న్ 1 ముగిసింది.

India becomes Kho Kho World Cup 2025 champion.. Indian women create history RMA

 

నేపాల్ ను చిత్తు చేసి ఖోఖో ఛాంపియన్ గా నిలిచిన భారత మహిళలు

 

ఆ త‌ర్వాత భార‌త‌ త్రయం చైత్ర, వైష్ణవి, ఇంగ్లే త‌మ అద్భుత‌మైన ప్ర‌ణాళిక‌ల‌తో అద‌ర‌గొట్టారు. డ్రీమ్ రన్‌ను స్కోర్ తో చైత్ర అద‌ర‌గొట్టింది.  త‌ర్వాత‌ నేపాల్ తిరిగి పుంజుకుంటుంది.. భార‌త‌ ఆధిక్యాన్ని దూరం చేయడానికి కొంత ఊపందుకుంది. కానీ, అయితే, వారు భార‌త్ దూకుడును అందుకోలేక‌పోయారు. టర్న్ 2 ముగిసే స‌మ‌యానికి 35-24 స్కోర్ తో నేపాల్ 11 పాయింట్లు వెనుక‌బ‌డి ఉంది.

ఇంగ్లే, ఆమె సహచరులు టర్న్ 3లో కూడా అటాకింగ్ జట్టుగా ఆధిపత్యం కొనసాగించారు, ఆరు బ్యాచ్‌లకు పైగా డిఫెండర్‌లను తొలగించి, నేపాల్‌పై 73-24 ఆధిక్యాన్ని సాధించారు. చైత్ర నేతృత్వంలోని భార‌త త్ర‌యం నేపాల్ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లింది. నేపాల్ కు భార‌త్ ముందు లొంగిపోవ‌డం త‌ప్ప‌లేదు. చివ‌ర‌కు 78-40 స్కోరుతో మ్యాచ్ ను భార‌త్ గెలుచుకుంది. ప్రారంభ ఖో ఖో ప్రపంచ కప్ ఛాంపియన్‌ టైటిల్‌ను అందుకుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios