సికింద్రాబాద్, ఆర్‌ కేపురం, ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ లో వివిధ టీచింగ్ పోస్టుల ఖలీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. టీచింగ్ పోస్టులకు సరైన అర్హతలు కలిగిన వారు ఆఫ్‌లైన్ పద్దతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. 

సికింద్రాబాద్‌ లోని ఆర్‌కే పురంలో ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ లో పనిచేయుటకు వివిధ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. టీచింగ్ పోస్టులకు సంబంధింత విభాగాల్లో ఏదైనా డిగ్రీ, పీజీతో పాటు బీ.ఈడీ అర్హత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. అభ్యర్థులు అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలీ. నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజుగా చెల్లించి తుది గడువులోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఉన్న ఖాళీలు 46.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


వివిధ టీచింగ్ పోస్టుల భ‌ర్తీ వివ‌రాలు.

ఖాళీగా ఉన్న పోస్టులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌ (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌ (టీజీటీ), ప్రైమ‌రీ టీచ‌ర్ (పీఆర్‌టీ).

aslo read NABARD'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

సబ్జెక్టుల వారీగా కేటాయించిన ఖాళీలు : ఇంగ్లిష్ 23, హిందీ 02, సంస్కృతం 02, హిస్టరీ 01, పొలిటికల్ సైన్స్ 01, మ్యాథమెటిక్స్ 02, ఫిజిక్స్ 01, కెమిస్ట్రీ 01, బయాలజీ 01, సైకాలజీ 01, కంప్యూటర్ సైన్స్ 01, ఫిజికల్ ఎడ్యుకేషన్ 03, సైన్స్ 01, ఆర్ట్ & క్రాఫ్ట్ 02, మ్యూజిక్ (వెస్టర్న్) 02, డ్యాన్స్ 01, స్పెషల్ ఎడ్యుకేటర్ 01.


ఉండాల్సిన అర్హత‌: 50% మార్కుల‌తో బీఈడీ, పీజీ ఉత్తీర్ణత‌ కలిగి ఉండాలి.

అర్హత వ‌య‌సు: 01.04.2020 నాటికి 40 సంవత్సరాల వయస్సు మించ‌కూడదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక చేసే విధానం: స్క్రీనింగ్ టెస్ట్‌, సీఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: 'Army Public School, RK Puram' పేరిట సికింద్రాబాద్‌లో చెల్లుబాటు అయ్యేలా రూ.100 డిడి తీయాలి. దరఖాస్తుకు డిడి జతచేసి పంపించాలి.

also read NFC Jobs: న్యూక్లియ‌ర్ ఫ్యూయ‌ల్ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సి) నోటిఫికేషన్ విడుదల


ద‌ర‌ఖాస్తులు పంపవలసిన చివ‌రి తేది: 05.01.2020

దరకస్థులు పంపవలసిన చిరునామా:
Army Public School,
RK Puram,
Trimulgherry,
Secunderabad,
Telangana-500056.