Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్‌‌: కొత్త ప్రభుత్వంపై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక ప్రకటన


ఆఫ్గన్ పరిణామాలపై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్  సోమవారం నాడు సమావేశమైంది. కొత్త ప్రభుత్వంపై కూడ కౌన్సిల్ సమావేశం సూచనలు చేసింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా కొత్త ప్రభుత్వం వ్యవహరించకూడదని కోరింది.

U.N. Security Council pushes for talks to form new Afghan government
Author
Afghanistan, First Published Aug 17, 2021, 3:14 PM IST

 వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా  ఓ సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సూచించింది.సోమవారం నాడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమై ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై చర్చించింది.  15 సభ్యుల కౌన్సిల్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్  హింసను విడనాడాలని, ఉగ్రవాద కార్యకలాపాలకు స్థానం కల్పించరాదని సూచించింది. తాము ఆఫ్ఘన్ ప్రజలను విడిచిపెట్టలేమని యూఎన్ఓ చీఫ్ గుటెర్రెస్ భద్రతా మండలికి చెప్పారు.

also read:ఆఫ్ఘనిస్తాన్‌ వాసులకు క్షమాభిక్ష: విధుల్లో చేరాలని అధికారులకు తాలిబన్ల ఆదేశం

ఆఫ్ఘనిస్తాన్  ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండకుండా అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని  కోరారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన ప్రాముఖ్యతను ఈ సమావేశం నొక్కి చెప్పింది.  తాలిబన్లు లేదా మరే ఇతర ఆఫ్ఘన్ సమూహం లేదా వ్యక్తి ఏ ఇతర దేశంలోని భూభాగంలోనూ పనిచేసే ఉగ్రవాదులకు మద్దతివ్వకూడదని  కోరింది.

కొత్త ప్రభుత్వంలో మహిళలకు స్థానం కల్పించాలని కూడ  సమావేశం సూచించింది.2001 సెప్టెంబర్ 11 వ తేదీన  ఒసామా బిన్ లాడెన్ బృందం అమెరికాపై దాడికి దిగింది.ఆఫ్ఘనిస్తాన్ లోని 15 రాష్ట్రాల్లో ఆల్‌ఖైదా విస్తరించి ఉందని సెక్యూరిటీ కౌన్సిల్ కు స్వతంత్ర నిపుణుల కమిటీ గత మాసంలో నివేదిక ఇచ్చింది.  ఇందులో ఆఫ్ఘన్, పాకిస్తాన్ జాతీయులున్నారని ఆ నివేదిక చెబుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios