Asianet News TeluguAsianet News Telugu

సూడాన్‌లో భద్రతా బలగాల మధ్య ఘర్షణలు.. సౌదీ విమానంపై గన్ ఫైర్

సూడాన్‌లో ఆర్మీ, పారామిలిటరీల మధ్య ఘర్షణలు జరిగాయి. సూడాన్ నుంచి సౌదీకి వెళ్లడానికి సిద్దమైన విమానంపై కాల్పులు జరిగాయి. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగానే ఉన్నారు.
 

sudan to saudi flight attacked amid unrest in sudan kms
Author
First Published Apr 16, 2023, 3:21 AM IST

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపేద దేశాల్లో ఒకటైన సూడాన్‌లో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. పౌర ప్రభుత్వం కోసం అక్కడి ప్రజలు ఇంకా ఎదురుచూపుల్లోనే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సూడాన్ ఆర్మీ, పార్యామిలిటరీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. కాల్పులు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన విమానంపై గన్ ఫైరింగ్ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.

సూడాన్ నుంచి సౌదీ అరేబియాలోని రియాద్‌కు ప్రయాణించాల్సిన విమానంపై శనివారంపై ఫైరింగ్ జరిగింది. ఎయిర్ బస్ ఏ330 విమానం పై కాల్పులు జరిగాయని, అందులో ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రియాద్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. ప్రయాణికులంతా బోర్డింగ్ అయ్యాక ఈ ఘటన జరిగింది.

Also Read: Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, సోదరుడు అష్రఫ్ హతం.. మీడియాతో లైవ్‌లో మాట్లాడుతుండగానే ఫైరింగ్(video)

అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని, ప్రయాణికులు, సిబ్బంది అంతా సేఫ్ అని ఆ స్టేట్‌మెంట్ పేర్కొంది. వారంతా సురక్షితంగా సూడాన్‌లోని సౌదీ ఎంబసీకి చేరుకున్నట్టు వివరించింది. ఇదిలా ఉండగా, సూడాన్‌లో పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఇతర దేశాల విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. 

శనివారం ఆర్మీ, పారామిలిటరీలకు మధ్య ఘర్షణలు జరిగాయని, ఇందులో ముగ్గురు పౌరులు మరణించినట్టు వైద్యుల సంఘం తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios