Asianet News TeluguAsianet News Telugu

నడిరోడ్డుపై మహిళను వేధించిన వ్యక్తి: బుద్ది చెప్పిన ప్రయాణీకులు, సోషల్ మీడియాలో వైరల్

నడిరోడ్డుపై  ఓ వ్యక్తి మహిళను వేధించారు. అయితే  అతనికి  దారిపోయేవారు బుద్ది చెప్పారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Karma Works Faster For Some People & This Video Of Man Harassing Woman Is Proof  lns
Author
First Published Feb 25, 2024, 10:19 AM IST

న్యూఢిల్లీ:చర్యకు ప్రతి చర్య ఉంటుందని మనం తరచుగా వినే ఉంటాం.  అయితే  ఓ మహిళను నడిరోడ్డుపై వేధింపులకు గురిచేసిన వ్యక్తిని రోడ్డున వెళ్లే ప్రయాణీకులు చితకబాదారు. ఈ ఘటనను కొందరు  వీడియో రికార్డ్ చేసి  సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

also read:ఇన్సూరెన్స్ డబ్బుల కోసం: అమ్మమ్మను మనవడు ఏం చేశాడంటే?

 

ఓ మహిళ ఒంటరిగా వీధిలో వెళ్తున్న సమయంలో  ఓ వ్యక్తి ఆ మహిళను వేధింపులకు గురి చేశాడు. ఆ వ్యక్తి నుండి తప్పించుకొనేందుకు ఆ మహిళ ప్రయత్నిస్తుంది.  అయితే అదే సమయంలో  ఓ బస్సు అదే దారి గుండా వెళ్తుంది.

also read:బుల్లెట్‌ కు గుడి కట్టి పూజలు: ఎందుకో తెలుసా?

ఈ బస్సులోని ప్రయాణీకులు  ఈ విషయాన్ని గమనించి  నిందితుడికి దేహశుద్ది చేశారు.  బస్సులోని ప్రయాణీకుల సహయంతో  బాధితురాలు అక్కడి నుండి సురక్షితంగా బయటపడింది.

 

ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహిళలను వేధించిన వ్యక్తికి దేహశుద్ది చేయడాన్ని సమర్ధించారు.  ఒక చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని  ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.గుర్తు తెలియని మహిళను రక్షించేందుకు ప్రయాణీకులు రావడాన్ని  కొందరు నెటిజన్లు  సంతోషం వ్యక్తం చేశారు. మహిళను కాపాడేందుకు వచ్చిన  వారిని  అభినందించారు.  మహిళను వేధించిన వ్యక్తికి మంచి గుణపాఠం చెప్పారని మరొకరు వ్యాఖ్యానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios