G7 summit: రష్యాన్ బంగారంపై నిషేధం.. జీ7 సమ్మిట్ సందర్భంగా జోబైడెన్ కీలక వ్యాఖ్యలు !
G7 summit-Joe Biden: అంతర్జాతీయ మీడియా రిపోర్టుల ప్రకారం.. US ట్రెజరీ డిపార్ట్మెంట్ మంగళవారం నాడు USలోకి రష్యా బంగారాన్ని దిగుమతి చేయడాన్ని నిషేధించే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. బంగారం మార్కెట్లో దాని భాగస్వామ్యాన్ని నిరోధించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి రష్యాను మరింత ఒంటరిగా చేయడం లక్ష్యంగా ఈ చర్యలు ఉంటాయని పేర్కొంటున్నాయి.
G7 summit live updates: ప్రపంచంలోని ఏడు సంపన్న దేశాల సమూహం అయిన G7 దేశాల కూటమి సమావేశం ఈ నెల 26,27 తేదీలలో జరగనుంది. జర్మనీలోని మ్యూనిజ్ లో జరగనున్న ఈ సమావేశంలో ఇంధనం, ఆహార భద్రత, ఉగ్రవాద వ్యతిరేకత, పర్యావరణం మరియు ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చిస్తారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు జీ7 సదస్సుకు ప్రధాని మోడీ హాజరవుతున్నారు. అధ్యక్షుడిగా జర్మనీ తన హోదాలో ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ ఆహార మరియు ఇంధన సంక్షోభానికి ఆజ్యం పోయడమే కాకుండా భౌగోళిక రాజకీయ సంక్షోభాన్ని ప్రేరేపించిన ఉక్రెయిన్ సంక్షోభంపై G7 నాయకులు దృష్టి సారించాలని భావిస్తున్నారు. జర్మనీ దక్షిణ ప్రాంతంలోని బవారియన్ ఆల్ప్స్ రీజియన్లో గల ఎల్మావ్ క్యాజిల్ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ సమ్మిట్ మొదలు కానుంది. ఈ సమావేశానికి జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్ దీనికి అధ్యక్షత వహిస్తారు. చర్చల అనంతరం జీ7 దేశాల ప్రతినిధులు సంబంధిత అంశాల తీర్మానాలను ఆమోదించనున్నారు.
G7 నాయకులు తమ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి సమావేశం కానున్నందున మంగళవారం నాడు పలు కీలక అంతర్జాతీయ అంశాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర గ్రూప్ ఆఫ్ సెవెన్ సెవెన్ లీడింగ్ ఎకానమీలు (G7) రష్యా నుండి బంగారం దిగుమతులపై నిషేధాన్ని ప్రకటిస్తాయని అధ్యక్షుడు జో బిడెన్ ఆదివారం చెప్పారు. ఉక్రెయిన్పై దాడి చేయడంతో రష్యాను ఆర్థికంగా మరింత ఒంటరిగా చేస్తామని నాయకులు ఆశిస్తున్నారు. రెండు రోజుల ఈ జీ7 సమ్మిట్ ముగిసిన తర్వాత మంగళవారం కీలక నిర్ణయాలు వెల్లడికానున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా గ్రూప్ ఆఫ్ సెవెన్ మిత్రదేశాలు ఆదివారం సమ్మిట్ ప్రారంభ రోజున ఇంధన సరఫరాలను మరియు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి వ్యూహాలపై చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి నుండి మాస్కోను శిక్షించడానికి పనిచేస్తున్న ప్రపంచ సంకీర్ణాన్ని చీల్చకుండా ఉండాలనే లక్ష్యంతో ఇవి ముందుకు సాగనున్నాయి.
శిఖరాగ్ర సమావేశం అధికారికంగా ప్రారంభించబడటానికి కొన్ని గంటల ముందు, రష్యా ఆదివారం ఉక్రెయిన్ రాజధానిపై క్షిపణి దాడులను ప్రారంభించింది. కనీసం రెండు నివాస భవనాలపై దాడి చేసిందని కైవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో చెప్పారు. మూడు వారాల్లో రష్యా చేసిన మొదటి దాడులు గా పేర్కొన్నారు. రష్యాలో ఇంధనం తర్వాత బంగారం రెండో అతిపెద్ద ఎగుమతి అని, దిగుమతులపై నిషేధం విధించడం వల్ల ప్రపంచ మార్కెట్లలో రష్యా పాల్గొనడం కష్టతరమవుతుందని బైడెన్ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ట్వీట్ ప్రకారం.. రష్యా తన బంగారం ఎగుమతుల ద్వారా 10 బిలియన్ల డాలర్లను ఆర్జించింది. ఇంధనం తర్వాత దాని అతిపెద్ద ఎగుమతి బంగారం. ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై అనేక అంక్షలు విధించాయి. అయినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా.. భయపడేది లేదంటూ రష్యా దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి జీ7 సమ్మిట్ లో చర్చ రానున్నట్టు సమాచారం.