చైనాలోని నైరుతి, వాయువ్య ప్రాంతాలలో ఆకస్మిక వరదల కారణంగా కనీసం డజను మంది మరణించినట్లు అక్కడి అధికార మీడియా తెలిపింది.

చైనా : నైరుతి, వాయువ్య చైనాలో ఆకస్మిక వరదల కారణంగా కనీసం డజను మంది చనిపోయారని.. వేలాది మంది ప్రజలు తమ నివాసప్రాంతాలు వదిలి వెళ్లాల్సి వచ్చిందని అక్కడి మీడియా ఆదివారం నివేదించింది. నైరుతి ప్రావిన్స్ సిచువాన్‌లో, కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదల కారణంగా కనీసం ఆరుగురు మరణించారు. మరో 12 మంది తప్పిపోయినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ CGTN నివేదించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శనివారం నాటికి 1,300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నివేదిక తెలిపింది. మరోవైపు గన్సు లోని వాయువ్య ప్రావిన్స్‌లోని లాంగ్నాన్ నగరంలో, మరో ఆరు మరణాలు నమోదయ్యాయి. ఇక్కడినుంచి 3,000 మందిని తరలించినట్లు రాష్ట్ర బ్రాడ్‌కాస్టర్ CCTV తెలిపింది. 1 1/2 రోజులో వర్షపాతం 98.9 మిల్లీమీటర్లు (3.9 అంగుళాలు)కురిసిందని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో, జూలైలో కురిసే సగటు కంటే దాదాపు రెట్టింపు వర్షం అని పేర్కొన్నారు. 

లాస్ వెగాస్ ఎయిర్ పోర్టులో 2 విమానాలు ఢీ.. న‌లుగురు మృతి

తూర్పు జెజియాంగ్ ప్రావిన్స్, షాంఘై నగరంతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. వీటి మధ్యే వర్షాలు కురుస్తున్నాయి, గత వారం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ (107 ఫారెన్‌హీట్) వరకు పెరిగాయి. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి విపరీత సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెచ్చని గాలి మరింత నీటిని నిల్వ చేయగలదు, ఇది విడుదలైనప్పుడు పెద్ద మేఘావృతాలకు దారితీస్తుంది. ప్రయాణాన్ని పరిమితం చేసే, సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించే కఠినమైన “జీరో-కోవిడ్” చర్యల ద్వారా వరదలు ఆర్థిక ఇబ్బందులను పాక్షికంగా పెంచుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.