లండన్ రైల్వే స్టేషన్లో బాంబు.. హైఅలర్ట్
లండన్ రైల్వే స్టేషన్లో బాంబు.. హైఅలర్ట్
బ్రిటన్ రాజధాని లండన్లో సాయంత్రం జనం.. భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. నగరంలోని చారింగ్ క్రాస్ రైల్వేస్టేషన్ వద్ద ఓ వ్యక్తి తన వద్ద బాంబు ఉందని చెప్పి ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాడు.. సమాచారం అందుకున్న పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకుని అతడిని పట్టుకున్నారు.. ముందు జాగ్రత్త చర్యగా స్టేషన్ను ఖాళీ చేయించారు.. రైలు సర్వీసులు నిలిపివేశారు.. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.. వీలైనంత త్వరగా స్టేషన్ను ప్రారంభిస్తమాని చెప్పారు.. కాగా.. బ్రిటన్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఘటన జరగడం అందరిని ఉలిక్కిపడేలా చేసింది.