Asianet News TeluguAsianet News Telugu

Earthquake: మొరాకోలో భారీ భూకంపం.. 632 మంది దుర్మరణం, వందలాది మంది క్షతగాత్రులు.. వివరాలివే (Video)

మొరాకోలో భారీ భూకంపం చోటుచేసుకుంది. 632 మంది ఈ భూకంపంలో దుర్మరణం చెందారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. శుక్రవారం రాత్రి మారకెశ్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అట్లాస్ కొండల్లో భూకంప కేంద్ర ఉన్నది.
 

at least 632 killed in morocco earthquake that stuck friday night kms
Author
First Published Sep 9, 2023, 1:38 PM IST

న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం మొరాకలో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఆఫ్రికాలో అరుదుగా భూకంపాలు వస్తుంటాయి. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న భారీ భూకంపంలో కనీసం 632 మంది మరణించారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. సెంట్రల్ మొరాకలో 6.8 తీవ్రతతో ఈ భూకంపం చోటుచేసుకుంది.

మొరాకో ఇంటీరియర్ మినిస్ట్రీ శనివారం తెల్లవారుజామున ఈ భూకంపం గురించి ఓ ప్రకటన చేసింది. భూకంపం చోటుచేసుకున్న ఏరియాల్లో కనీసం 632 మంది మరణించారని తెలిపింది. అదనంగా మరో 300 మందిని చికిత్స కోసం హాస్పిటళ్లకు తరలించినట్టు వివరించింది. చాలా వరకు నష్టం నగరాల వెలుపల చిన్న పట్టణాల్లో చోటుచేసుకున్నట్టు పేర్కొంది. అయితే.. ఈ భూకంప నష్టాన్ని అధికారులు ఇంకా అంచనా వేయాల్సి ఉన్నది.

భూమి కంపించగానే ప్రజలు భయంతో బయటకు పరుగుపెట్టారు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భవనాలు, రిసార్టులు, హోటళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగుతీశారు. ఆ భయానక క్షణాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం శుక్రవారం రాత్రి 11.11 గంటలకు 6.8 తీవ్రతతో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది. అట్లాస్ కొండల్లో మారకెశ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్ర ఉన్నట్టు అధికారులు తెలిపారు. టౌబ్‌కాల్‌కు సమీపంలోనే ఇది ఉంటుంది. 

Also Read: విషాదం.. మొరాకోలో భారీ భూకంపం.. 296 మంది మృతి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ భూకంపంపై స్పందించారు. భూకంపం వల్ల మరణించినవారికి ఆయన ఎక్స్ ద్వారా సంతాపం తెలిపారు. మొరాకలో భూకంపం వల్ల మరణాలు తనను కలచివేసినట్టు వివరించారు. ఈ విషాద సమయంలో తాము మొరాకోకు అండగా ఉంటామని తెలిపారు. తమ ఆప్తులను కోల్పోయిన వారికి సానుభూతి అని వివరించారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios