హైదరాబాద్‌లో భద్రతా సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్. మాక్ ఎయిర్ రైడ్ ద్వారా అప్రమత్తత పరీక్ష, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ నగరంలో భద్రతా పరిస్థితులపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి)లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో ఈ సమీక్షను ఏర్పాటు చేశారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రజలు కలవరపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తత మాత్రం అవసరమని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం, దేశ భద్రతకు బలోపేతం చేసే దిశగా మిలిటరీ అధికారులకు అవసరమైన సహకారం అందిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆపరేషన్ అభ్యాస్..

ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో అత్యవసర స్పందన వ్యవస్థలను పరీక్షించేందుకు నాలుగు ప్రాంతాల్లో మాక్ ఎయిర్ రైడ్ వ్యాయామాలు చేపట్టనున్నారు. సికింద్రాబాద్, గోల్కొండ కంటోన్మెంట్, కాంచన్ బాగ్, నాచారం ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు సైరన్లు వినిపించనున్నాయి.ఈ డ్రిల్లులు ‘ఆపరేషన్ అభ్యాస్’లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వ‌హిస్తున్నారు. 244 జిల్లాలు ఇందులో భాగమైనవిగా గుర్తించబడ్డాయి. ప్రజల ప్రాథమిక రక్షణ, ముఖ్యంగా వైమానిక ముప్పుల సందర్భంలో స్పందన సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా ఈ వ్యాయామాలు ఉంటాయి.ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ, హైదరాబాద్ వ్యాయామంలో భాగస్వామిగా ఉండటం దేశ భద్రతకు రాష్ట్రం చేసే కృషికి ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు.