సరిగ్గా తినకపోవడం, జీవన శైలి మార్పులు, ఆహారంలో మార్పులు, ఫుడ్ ను సరిగ్గా నమలకపోవడం, కారం, ఉప్పులను ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది.
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. అసిడిటీ ప్రధాన లక్షణాలు భోజనం చేసిన వెంటనే గుండెల్లో మంట, కడుపులో మంట కలగడం. కొంతమందికి కడుపు నొప్పి కూడా వస్తుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే అల్సర్లతో పాటుగా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
సరిగ్గా తినకపోవడం, జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు, తప్పుడు ఫుడ్ కాంబినేషన్, కారంగా, పుల్లగా ఉండే ఆహారాలు, మానసిక ఒత్తిడి మొదలైనవి ఎసిడిటీకి దారితీస్తాయి. ఎసిడిటీని నివారించడానికి మీరు చేయవలసిన మొదటి పని ప్రతిరోజూ సమయానికి తినడం. అలాగే మీరు తినే భోజనాల మధ్య గ్యాప్ ను తగ్గించాలి. ఒకేసారి ఎక్కువ ఫుడ్ ను తినకూడదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తినడం మంచిది. ఎసిడిటీని నివారించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- నూనెలో వేయించిన, వేయించిన ఆహారాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. వీటికి బదులుగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినండి.
- కెఫిన్ కంటెంట్ ఉన్న ఉన్న ఆహారాలను వీలైనంత తగ్గించండి. లేదా పూర్తిగా మానేయండి.
- ఎసిడిటీ సమస్య ఉన్నవారు నారింజ, నిమ్మకాయలు వంటి యాసిడ్ అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తినకపోవడమే మంచిది.
- బంగాళాదుంపలు, బీన్స్ కూడా ఎసిడిటీకి దారితీస్తాయి. అందుకే ఏవి ఎసిడిటీని కలిగిస్తాయో ముందే తెలుసుకోవాలి.
- కాఫీ, పాలు, టీ, వెన్న కూడా కొందరిలో ఎసిడిటీకి కారణమవుతాయి. వాటిని కూడా ఎక్కువగా తీసుకోకండి.
- సోయాబీన్, ఓట్ మీల్, నట్స్ మొదలైనవి కొందరిలో ఎసిడిటీని కలిగిస్తాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
- వీలైనంత వరకు ఊరగాయలకు దూరంగా ఉండండి. ఇవి కూడా ఎసిడిటీకి దారితీస్తాయి.
- పడుకోవడానికి రెండు గంటల ముందే తినండి.
- ఆహారాన్ని బాగా నమిలి తినడానికి ప్రయత్నించండి. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా తింటే జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. అలాగే ఆమ్ల ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుంది.
- భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలను తినడం అలవాటు చేసుకోండి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి.
- నీటిని పుష్కలంగా తాగాలి. నీరు జీర్ణక్రియను సులభతరం చేయడానికి, కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
