ఎర్రబియ్యం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఈ రైస్ ను తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. అలాగే మహిళల పునరుత్పత్తి అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే..
అన్నంలో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవే మన శరీరానికి శక్తి వనరులు. అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలలో బియ్యం ప్రధాన ఆహారం. వరి ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. సుమారు 40 వేల రకాల వరి రకాలు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని రకాలను మాత్రమే పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. దీనిని మిల్లింగ్ చేసి పాలిష్ చేస్తారు. వైట్ రైస్ ను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తింటున్నప్పటికీ.. అయితే కొన్ని ప్రత్యేక రకాల వరిని కూడా పండిస్తున్నారు. వీటిలో రంగురంగుల, సుగంధ బియ్యం రకాలు కూడా ఉన్నాయి. తెల్ల బియ్యం రకాల కంటే ఇతర రకాల బియ్యంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేక రకాల్లో రెడ్ రైస్ ఒకటి. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఎర్ర బియ్యం పొట్టు పొరలో ఆంథోసైనిన్ వర్ణద్రవ్యాలు పేరుకుపోవడం వల్ల బియ్యం సాధారణంగా ఎరుపు రంగులోకి మారుతాయి. వీటిలో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి సహాయపడతాయి.
విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి
రెడ్ రైస్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో విటమిన్లు, మినరల్స్, పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే?
మహిళల లైంగిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది
ఆయుర్వేదంలో ఎర్ర బియ్యం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. దక్షిణాసియా దేశాలలో బాలికలకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎర్ర బియ్యాన్ని తినిపిస్తారు. దీనిలో ఉండే ఐరన్, ఎసెన్షియల్ ప్రోటీన్ రక్తహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది జనేంద్రియాలను బలోపేతం చేస్తుంది. పీరియడ్స్ తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతే కళ్లు, కాలేయం, మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన అన్ని ప్రధాన అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఎర్ర బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 55 గా ఉంటుంది. మధుమేహులు దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కడుపును కూడా ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది.
ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం.. దీనిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. రెడ్ రైస్ ను రోజూ తినడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది శ్వాస విధానాలను మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని ప్రతి కణంలో ఆక్సిజన్ వినియోగాన్ని, ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది
దీనిలో కాల్షియం, మెగ్నీషియంలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, వివిధ ఎముక సంబంధిత రుగ్మతలను నివారించడానికి సహాయపడతాయి.
తేలికగా జీర్ణం అవుతాయి
జర్నల్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ప్రకారం.. ఎర్ర బియ్యంలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి. ఫైబర్ ప్రేగు కదలికకు సహాయపడుతుంది. ఇది విరేచనాలను కూడా తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి
రెడ్ రైస్ ను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఈ బియ్యంలో కొవ్వు మొత్తమే ఉండదు. కాబట్టి దీన్ని లంచ్ లేదా డిన్నర్ లో కూడా తినొచ్చు. ఇతర రకాల బియ్యం మాదిరిగా కాకుండా దీనిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండవు.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ లో ప్రచురితమైన ఒక పరిశోధన కథనం ప్రకారం.. తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యాన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బియ్యంలో తృణధాన్యాలు ఉండటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దీంతో గుండు ఆరోగ్యంగా ఉంటుంది.
