గర్భిణీ స్త్రీలకు కరోనా వ్యాక్సిన్.. దియా మీర్జా కీలక సూచనలు
దేశంలో చాలా మంది గర్భిణీ స్త్రీలు కరోనా బారినపడుతున్నారంటూ... ఓ మహిళ ట్వీట్ చేయగా.. ఆమె ట్వీట్స్ కి దియా మీర్జా స్పందించారు.
కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విలయతాండవం చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు గర్భిణీ స్త్రీలకు మాత్రం వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై బాలీవుడ్ నటి దియా మీర్జా పలు సూచనలు చేశారు.
దియా మీర్జా ఇటీవల వైభవ్ రేఖిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆమె త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వనున్నారు.
ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న కరోనా టైమ్ లో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.
దేశంలో చాలా మంది గర్భిణీ స్త్రీలు కరోనా బారినపడుతున్నారంటూ... ఓ మహిళ ట్వీట్ చేయగా.. ఆమె ట్వీట్స్ కి దియా మీర్జా స్పందించారు.
ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అది గర్భిణీ స్త్రీలకు మాత్రం కాదని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ పై ఇంకా క్లినికల్ ట్రయల్స్ కూడా జరగలేదని పేర్కొన్నారు. కాబట్టి.. వ్యాక్సిన్ తీసుకోకూడదని ఆమె పేర్కొన్నారు.
క్లినికల్ ట్రయల్స్ కూడా జరగకుండా.. గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోకూడదని.. ఈ విషయాన్ని తనకు తమ డాక్టర్లు వివరించారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం.. దియా మీర్జా తాను ప్రగ్నెంట్ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన బేబీ బంప్ కనపేడలా ఫోటోలు దిగి వాటిని షేర్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దియా..వైభవ్ రాఖీని పెళ్లాడారు. పెళ్లి తర్వాత ఆ ఫోటోలను దియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.