- Home
- Telangana
- అయ్యో పాపం.. హైదరాబాద్ యాక్సిడెంట్ లో మృతిచెందిన ముగ్గురూ ఒకేకుటుంబం, ఒక్కగానొక్క కొడుకులే
అయ్యో పాపం.. హైదరాబాద్ యాక్సిడెంట్ లో మృతిచెందిన ముగ్గురూ ఒకేకుటుంబం, ఒక్కగానొక్క కొడుకులే
తెలంగాణలో బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ శివారుుప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు యువకులు ఒకే కుటుంబానికి చెందినవారు… ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకులే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
Hyderabad Accident : వేసవికాలంలో మధ్యాహ్నం ఎండలు మండిపోతాయి కాబట్టి చాలామంది రాత్రుళ్లు ప్రయాణం చేస్తుంటారు. ఇదే ఇప్పుడు ప్రమాదాలకు దారితీస్తోంది. రాత్రుళ్లు రోడ్లపైకి లారీలు, డిసిఎం, ట్రావెల్ బస్సులు వంటి పెద్ద వాహనాలు ఎక్కువగా వస్తుంటాయి.. ఇదే సమయంలో ఇతర వాహనాలు కూడా రోడ్డెక్కడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా తాజాగా హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
నుజ్జునుజ్జయిన కారు
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరుకు చెందిన యువకులు ఓ శుభకార్యానికి కారులో వెళ్లారు. పెద్ద అంబర్ పేటలో వేడుకకు హాజరై రాత్రి నారపల్లిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బస చేసారు. ఉదయం తమ నివాసానికి వెళుతుండగా ఘోరం జరిగింది... మరికొద్దిసేపట్లో ఇంటికి చేరతారనగా రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు వెళుతున్న కారు వేగంగా దూసుకువస్తున్న డిసిఎంకు ఎదురెళ్లి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయి అందులోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు... మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
హైదరాబాద్ రోడ్డు ప్రమాద మృతుల వివరాలు
ఈ ప్రమాదంలో పిన్నింగటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రినాథ్ రెడ్డి (24), చుంచు వర్షిత్ రెడ్డి (23) ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే హయత్ నగర్ లోని సన్ రైజ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు... అతడి పరిస్ధితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది.
అతివేగమే ప్రమాదానికి కారణమా?
ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
తల్లిదండ్రులకు కడుపుకోత
ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకులంతా చదువుకునేవారు.. ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకులే. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకులు ఇలా కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కడుపుశోకానికి గురయిన ఆ పేరెంట్స్ వేదన చూసేవారికి కన్నీరు తెప్పిస్తోంది.