MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?

Pensions: తెలంగాణ‌లో ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క గ్యారెంటీని అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 16 2025, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెన్షన్ల పెంపుపై ప్రభుత్వ ఫోకస్
Image Credit : Generated by google gemini AI

పెన్షన్ల పెంపుపై ప్రభుత్వ ఫోకస్

తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన ఈ హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయాలన్న లక్ష్యంతో కార్యాచరణ సాగుతోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా వివిధ వర్గాలకు అందుతున్న పింఛన్లను పెంచేందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు సమీక్షలు చేస్తున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పెంపు అమలు చేయాలన్న ఆలోచనపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.

25
ఖజానాపై ఎంత భారం ప‌డ‌నుంది.?
Image Credit : Asianet News

ఖజానాపై ఎంత భారం ప‌డ‌నుంది.?

ప్రస్తుతం రాష్ట్రంలో పింఛన్ల కోసం 2025–26 బడ్జెట్‌లో సుమారు రూ.11,635 కోట్లు కేటాయించారు. లబ్ధిదారుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, ఎన్నికల హామీల ప్రకారం అన్ని పింఛన్లు పెంచిన పరిస్థితిలో వార్షిక వ్యయం దాదాపు రూ.22 వేల కోట్ల వరకు చేరే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ భారాన్ని బడ్జెట్‌లో ఎలా సమతుల్యం చేయాలి అన్న అంశంపై ఆర్థిక శాఖ విస్తృతంగా లెక్కలు వేస్తోంది.

Related Articles

Related image1
Silver Price: ఈ రోజు 5 కిలోల వెండి కొంటే.. 2030 నాటికి మీ ద‌గ్గ‌ర ఎన్ని డ‌బ్బులుంటాయో తెలుసా.?
Related image2
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం
35
రూ.500 పెంపా? రూ.1000 పెంపా?
Image Credit : our own

రూ.500 పెంపా? రూ.1000 పెంపా?

పింఛన్లను ఎంత మేర పెంచాలన్న విషయంపై ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం అందుతున్న మొత్తానికి రూ.500 పెంచాలా లేక రూ.1000 వరకు పెంచాలా అన్న అంశంపై లోతైన చర్చ సాగుతోంది. నిజానికి ఎన్నిక‌ల హామీలో భాగంగా రూ. 2 వేల పెన్ష‌న్‌ను రూ. 4 వేల‌కు పెంచుతామ‌ని హామీ ఇచ్చారు. అయితే ఒకేసారి పూర్తి స్థాయిలో పెంపు సాధ్యం కాకపోతే దశలవారీగా అమలు చేయాలన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

45
ప్రస్తుతం అమలులో ఉన్న పింఛన్లు
Image Credit : iSTOCK

ప్రస్తుతం అమలులో ఉన్న పింఛన్లు

రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. దివ్యాంగులకు నెలకు రూ.4,016 చెల్లిస్తున్నారు. డయాలసిస్ రోగులు సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛన్లు అమలులో ఉన్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం సాధారణ పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాల్సి ఉంది.

55
బోగస్ పింఛన్ల నియంత్రణ, కొత్త దరఖాస్తులు
Image Credit : X/revanth_anumula

బోగస్ పింఛన్ల నియంత్రణ, కొత్త దరఖాస్తులు

బోగస్ పింఛన్లను అడ్డుకునేందుకు ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఆదా అయ్యే నిధులను పెరిగిన పింఛన్లకు వినియోగించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా అర్హత పొందినవారి నుంచి పింఛన్ దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, వైద్య ఖర్చుల నేప‌థ్యంలో పెన్ష‌న్ పెంపు వార్త ల‌బ్ధిదారుల్లో ఆశ‌ల‌న పెంచేస్తోంది. మ‌రి పెన్ష‌న్లు ఎప్ప‌టి నుంచి పెర‌గ‌నున్నాయ‌న్న‌దానిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
Recommended image2
హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
Recommended image3
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?
Related Stories
Recommended image1
Silver Price: ఈ రోజు 5 కిలోల వెండి కొంటే.. 2030 నాటికి మీ ద‌గ్గ‌ర ఎన్ని డ‌బ్బులుంటాయో తెలుసా.?
Recommended image2
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved