MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad Public School : ఈ స్కూల్ నుండే నలుగురు గ్లోబల్ సీఈవోలు, ఇద్దరు సీఎంలు... మీ పిల్లలనూ ఇక్కడ చదివించొచ్చు

Hyderabad Public School : ఈ స్కూల్ నుండే నలుగురు గ్లోబల్ సీఈవోలు, ఇద్దరు సీఎంలు... మీ పిల్లలనూ ఇక్కడ చదివించొచ్చు

Global CEO Alumni వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ స్కూల్ ఒకటి ప్రపంచస్థాయి కంపెనీలకు సీఈవోలను అందిస్తోంది. తాజాగా ఈ స్కూల్లో చదివిన మరో వ్యక్తి అమెరికన్ దిగ్గజ కంపెనీకి సీఈవోగా ఎంపికయ్యారు. ఇంతకూ ఆ స్కూల్ ఏదో తెలుసా? 

3 Min read
Arun Kumar P
Published : Jul 30 2025, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Hyderabad Public School
Image Credit : Hyderabad Public School Website

Hyderabad Public School

Hyderabad Public School : ప్రపంచానికి సిఈవోలను అందిస్తున్న దేశంగా భారత్ మారుతోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను భారత సంతతికి చెందినవారు నడిపిస్తున్నారు... ఇప్పుడు మరొకరు కూడా ఈ జాబితాలో చేరిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే అమెరికన్ కంపెనీ P&G (ప్రాంక్టర్ & గాంబుల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా శైలేష్ జెజురీకర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ Procter & Gamble చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) గా ఉన్న ఆయన వచ్చే ఏడాది ఆరంభంలో అంటే జనవర్ 1, 2026 లో సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇప్పటికే భారత సంతతికి చెందిన సత్యనాదెళ్ల మైక్రోసాప్ట్, సుందర్ పిచాయ్ గూగుల్ (ఆల్ఫా బెట్), శంతను నారాయణ్ అడోబ్, అరవింద కృష్ణ ఐబీఎం కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారు. వీరంతా అంతర్జాతీయ సంస్థల్లో అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తూ భారతీయులు గర్వపడేస్థాయిలో ఉన్నారు. ఇప్పుడు శైలేష్ జుజురీకర్ P&B సీఈవోగా ఎంపికవడంతో భారత్ ప్రపంచానికి సీఈవోలను అందిస్తున్న దేశంగా గుర్తింపుపొందింది.

ఆసక్తికర విషయం ఏమిటంటే శైలేష్ పుట్టింది ముంబైలో అయినా హైదరాబాద్ తో ఆయనకు ప్రత్యేక అనుబంధం కలిగివున్నారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే కొనసాగింది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే మైక్రోసాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల చదివిన స్కూల్లోనే శైలేష్ కూడా చదివారు. కేవలం ఈ ఇద్దరే కాదు మరికొన్ని అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు కూడా ఈ స్కూల్లో చదివినవారే. ఇక ఎందరో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు కూడా ఈ స్కూల్లో చదివారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆ స్కూల్ ఇంకేదో కాదు... హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.

DID YOU
KNOW
?
దేశంలోని టాప్ 10 స్కూల్స్ చోటు
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దేశంలోనే అత్యుత్తమ స్కూల్స్ లో ఒకటి. 2017లో భారత్‌లోని టాప్ 10 స్కూల్స్‌లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ స్కూల్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
25
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన సీఈవోలు వీరే
Image Credit : P&B Website

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన సీఈవోలు వీరే

ప్రాక్టర్ & గాంబులర్ సీఈవోగా ఎంపికైన శైలేష్ జెజురీకర్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ప్రస్తుత మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు... వీరిద్దరూ క్లాస్ మేట్స్ కూడా. ఇలా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్నేహితులు ఇప్పుడు టాప్ అమెరికన్ కంపెనీలకు సిఈవో లు అయ్యారు.

ఇక వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా కూడా ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివారు. ఈయన గతంలో మాస్టర్ కార్డ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో, ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. అలాగే అడోబ్ సీఈవో శంతను నారాయణ్ కూడా ఈ స్కూల్ విద్యార్థే. ఇలా ఒకే స్కూల్లో చదివిన నలుగురు అంతర్జాతీయ కంపెనీలను నడిపించే స్థాయికి చేరుకున్నారు.

Related Articles

Related image1
బిర్యానీని టిఫిన్స్ జాబితాలో చేర్చిన చాట్‌జీపీటీ.. తాను హైదరాబాదీ అంటూ సత్య నాదెళ్ల రియాక్షన్ ఇదే..
Related image2
సుందర్ పిచాయ్ సాలరీ 2 మిలియన్లే... మరి బిలియనీర్ ఎలా అయ్యారబ్బా..!
35
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇద్దరు సీఎంలను అందించింది
Image Credit : X/YS Jaganmohan Reddy

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇద్దరు సీఎంలను అందించింది

నిజాంల కాలంలో ప్రారంభమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కేవలం అంతర్జాతీయ స్థాయి ఉద్యోగులనే కాదు ఎందరో నాయకులను కూడా అందించింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ స్కూల్లోనే చదువుకున్నారు. స్కూల్ డేస్ లో మంచి క్రికెటర్ అయిన ఆయన చివరకు రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసారు.

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఇతడి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసారు... దీంతో వీరి కుటుంబం హైదరాబాద్ లో ఉండేవారు. దీంతో వైఎస్ జగన్ ప్రాథమిక విద్యాబ్యాసం హెచ్పిఎస్ లో సాగింది. తండ్రి బాటలో నడుస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఐదేళ్లపాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

45
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చరిత్ర
Image Credit : Hyderabad Public School Website

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చరిత్ర

తెెలంగాణను పాలించిన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ లో మంచి విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని స్వాతంత్య్రానికి పూర్వమే భావించారు. ఈయన ఆలోచనకు బ్రిటిష్ అధికారుల సలహాలు, సూచనలు కూడా తోడయ్యాయి. దీంతో 1923 లో బేగంపేటలో ఓ స్కూల్ ను ఏర్పాటుచేశారు... ఇదే ఇప్పుడున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.

ఆరంభంలో ఈ స్కూల్ కేవలం ఐదుగురు విద్యార్థులు, ఆరుగురు టీచర్స్ తో ప్రారంభమైంది. అనంతరం అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే బెస్ట్ స్కూల్స్ జాబితాలో చేరిపోయింది. ఈ స్కూల్లో చదివిన ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇలా వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ స్కూల్ ఇప్పటికి విద్యార్థులను తీర్చిదిద్దుతోంది.

55
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఇతర ప్రముఖులు
Image Credit : Getty

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఇతర ప్రముఖులు

ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బోంగ్లే, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి కూడా ఈ స్కూల్లో చదివినవారే. ప్రిస్మా క్యాపిటల్ పార్టనర్స్ వ్యవస్థాపకులు గిరీష్ రెడ్డి, ఫెయిర్ ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్ సీఈవో ప్రేమ్ వత్స కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులే. ఇంకా సినీ హీరోలు నాగార్జున, రానా కూడా ఇక్కడే చదివారు. ఇలా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లో ఉన్నతస్థాయికి చేరుకున్నవారిని ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అందించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
వ్యాపారం
వైరల్ న్యూస్
సాంకేతిక వార్తలు చిట్కాలు
ప్రసిద్ధ వ్యక్తులు
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved