Hyderabad : ఏకంగా మాజీ సీఎం ఇంటినే సీజ్ చేసేశారా..! ఎందుకో తెలుసా..?
Hyderbad : మాజీ ముఖ్యమంత్రి… ఓ పార్టీ మాజీ అధ్యక్షురాలు… అందులోనూ ఓ మహిళా నాయకురాలు… అలాంటిది హైదరాబాాద్ లోని ఆమె ఇంటినే అధికారులు జప్తు చేశారు. ఆమె ఎవరు... ఎందుకు జప్తు చేశారో తెలుసా..?

మాజీ సీఎం ఇళ్లు జప్తు..
Hyderabad : తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సామాన్యులకే రూల్స్ అన్ని.. బడాబాబులకు ఎలాంటి చట్టాలు వర్తించవనే భావన ప్రజల్లో ఉంది. దీన్ని తొలగించే ప్రయత్నమో లేక మరేదైనా రీజన్ ఉందో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ మాజీ ముఖ్యమంత్రి ఇంటిని సైతం అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ఎవరా మాజీ సీఎం..?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలితకు దేశవ్యాప్తంగా భారీ ఆస్తులున్నాయి. ఇలా తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు హైదరాబాద్ లో కూడా విలాసవంతమైన ఇళ్లు ఉంది. శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర హిల్స్లో ఉన్న ఈ ఇల్లు జయలలిత పేరు మీదే రిజిస్టర్ అయివుంది. ఈ ఇంటిపైనే తాజాగా అధికారులు చర్యలు తీసుకున్నారు... ఏకంగా సీజ్ చేశారు.
జయలలిత ఇంటిని ఎందుకు సీజ్ చేశారు..?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 2025–26 సంవత్సరానికి సంబంధించి ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. 'ఒకేసారి పన్ను చెల్లింపు' పథకం కింద ప్రాపర్టీ ట్యాక్స్ పాత బకాయిలపై ఉన్న వడ్డీలో 90% మాఫీ చేస్తోంది. ఈ స్కీమ్ ప్రకారం ఇంటి యజమానులు అసలు మొత్తంతో పాటు 10 శాతం వడ్డీని 2026, మార్చి 31 లోపు కట్టాలి.
అయితే జయలలిత ఇంటికి సంబంధించి ఏకంగా రూ.82 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉంది. 2017 లో ఆమె మరణం తర్వాత ఈ ఇంటిని పట్టించుకున్నవారే లేదు... అందుకే భారీ ట్యాక్స్ పెండింగ్ లో ఉన్నాయి. దీంతో మాజీ సీఎం, ఏఐఏడీఎంకే మాజీ అధినేత్రి జయలలిత ఇంటిని జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు.
నోటీసులు పంపినా నో రెస్పాన్స్.. అందుకే జప్తు
జయలలిత ఇంటికి సంబంధించిన పన్ను వసూలు చేయడానికి జిహెచ్ఎంసి అధికారులు చాలాసార్లు ప్రయత్నించారు. కానీ సంబంధిత వ్యక్తులు ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి నెలలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నోటీసులు పంపారు. దానికి కూడా స్పందన రాకపోవడంతో చివరికి అధికారులు జయలలిత ఇంటిని సీజ్ చేశారు. బకాయిలు చెల్లించే వరకు ఈ ఆస్తి మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోనే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఏఐఏడీఎంకే నాయకత్వం ఏం చేస్తోంది..?
తమిళనాడుకు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత ఇంటిని ఇలా సీజ్ చేయడం తమిళ ప్రజలను షాక్కు గురిచేసింది. 'మోదీయా లేడీయా' అంటూ జాతీయ రాజకీయాల్లో చర్చ రేపిన 'తమిళనాడు ఉక్కు మహిళ' ఇంటిని కాపాడేందుకు ఏఐఏడీఎంకే నాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి జయలలిత కుటుంబసభ్యలు గానీ, పార్టీ నాయకత్వం గానీ ఈ ఆస్తిపన్ను చెల్లించి ఇంటిని విడిపించుకుంటారేమో చూడాలి.

