Weather Update: ఏపీ, తెలంగాణలో 6 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ వార్నింగ్
Weather Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వచ్చే ఆరు రోజులు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్కు రుతుపవనాలు చేరాయ. జూన్ 17 నాటికి రెండు రాష్ట్రాల్లో ఇవి పూర్తిగా విస్తరించనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

హైదరాబాద్కు చేరని నైరుతి రుతుపవనాలు
ఎండలతో నలిగిపోతున్న జనాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూపర్ న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుపవనాలు ఎట్టకేలకు భాగ్యనగరాన్ని తాకాయి. జూన్ 17 నాటికి ఇవి రెండు రాష్ట్రాల్లో 100% విస్తరించనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 95% మేర ఇవి కవర్ అయ్యాయి. మిగిలిపోయిన శ్రీకాకుళం, విజయనగరంలోకి కూడా ఆదివారం వరకు పూర్తిగా ఎంట్రీ ఇవ్వనున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల పాటు వానలే వానలు
తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో జూన్ 14 నుంచి 19 వరకు.. అంటే 6 రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయి. జూన్ 14 నుంచి 17 వరకు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉంది. గాలి వేగం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్లు ఉండొచ్చు. ప్రస్తుతం తెలంగాణపై ఉపరితల తుపాను తరహా ఆవర్తనం ఉంది. దీనివల్ల ఉత్తర, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ అప్డేట్
ఆదివారం ఉదయం ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. సాయంత్రానికి విశాఖ, రాయలసీమలో జల్లులు పడొచ్చు. ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, తెలంగాణలో 39 డిగ్రీలుగా నమోదు కానుంది. రాయలసీమలో చల్లని గాలులు వీస్తున్నాయి.
సముద్రంలో గాలుల బీభత్సం
అరేబియా సముద్రంలో రుతుపవనాలు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వీస్తూ తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి. బంగాళాఖాతంలో కూడా గాలుల వేగం 55 కిలోమీటర్లుగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లడం సేఫ్ కాదని అధికారులు తెలిపారు. జూన్ 20 తర్వాత మాల్దీవుల నుంచి వచ్చే మేఘాల వల్ల ఈ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయని అంచనా.
పసిఫిక్, అంటార్కిటికాలలో మార్పులతో వెదర్ పై ప్రభావం
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన రెండు అల్పపీడనాలు బలహీనపడ్డాయి. ఇవి తుపానులుగా మారకపోవడం వల్ల మనకు వేడి గాలుల ముప్పు తప్పింది. మరోవైపు అంటార్కిటికా నుంచి చల్లని మంచు హిందూ మహాసముద్రంలో కలవడం వల్ల రుతుపవనాలు మరింత స్ట్రాంగ్ అవుతున్నాయి. దీనివల్ల జూన్ అంతా, జులై మొదటి 10 రోజులు వర్షాలు బాగుంటాయి. కాబట్టి రైతులు వ్యవసాయ అధికారుల సలహాలతో పంట ప్లాన్ చేసుకోవడం మంచిది.

