MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఓరి దేవుడా ఎంతటి విషాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ, భారీగా మృతుల సంఖ్య

ఓరి దేవుడా ఎంతటి విషాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ, భారీగా మృతుల సంఖ్య

Accident: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. 

2 Min read
Narender Vaitla
Published : Nov 03 2025, 09:29 AM IST| Updated : Nov 03 2025, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్ర‌మాదం ఎక్క‌డ జ‌రిగింది.?
Image Credit : Telugu Scribe/X

ప్ర‌మాదం ఎక్క‌డ జ‌రిగింది.?

హైద‌రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన లారీ మీర్జాగూడ సమీపంలో బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రతకు లారీపై ఉన్న కంకర మొత్తం బస్సుపై పడింది. దాంతో వాహనంలోని ప్రయాణికులు అందులోనే చిక్కుకున్నారు. సుమారు 17 మంది అక్కడికక్కడే మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పది నెలల చిన్నారితో పాటు బస్సు డ్రైవర్‌, లారీ డ్రైవర్‌ ఉన్నారని అధికారులు తెలిపారు.

26
కొన‌సాగుతోన్న‌ సహాయక చర్యలు
Image Credit : Telugu Scribe/X

కొన‌సాగుతోన్న‌ సహాయక చర్యలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే చేవెళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు జేసీబీల సాయంతో కంకరలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంకా కంకర కింద కొందరు ఉన్నారని భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.

Related Articles

Related image1
ఆకాశంలో అల్లకల్లోలం.. తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
Related image2
ఇదిగో.. భారత్ విజయానికి ఈ క్యాచే కారణం.. లేదంటే ఫలితం వేరేలా ఉండేది. వైర‌ల్ వీడియో
36
బస్సులో విద్యార్థులు, ఉద్యోగులు
Image Credit : Telugu Scribe/X

బస్సులో విద్యార్థులు, ఉద్యోగులు

తాండూరు నుంచి హైదరాబాద్‌ వైపు బయల్దేరిన ఆర్టీసీ బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు. వారాంతం కావడంతో స్వగ్రామాల నుంచి నగరానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిన‌ట్లు తెలుస్తోంది. ప్రమాదంతో హైదరాబాద్‌–బీజాపూర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

46
రంగంలోకి పోలీసులు
Image Credit : Telugu Scribe/X

రంగంలోకి పోలీసులు

సహాయక చర్యల సమయంలో పోలీసులు 15 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. వారిలో బస్సు కండక్టర్‌ రాధ కూడా ఉన్నారు. ఈ ప్రాసెస్‌లో చేవెళ్ల సీఐ భూపాల్‌ శ్రీధర్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఒక జేసీబీ ఆయనపైకి ఎక్కడంతో ఎడమ కాలికి గాయమైంది. ఆయనను వెంటనే చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

56
హృదయ విదారక దృశ్యాలు
Image Credit : Telugu Scribe/X

హృదయ విదారక దృశ్యాలు

ప్రమాద స్థలంలో దారుణ దృశ్యాలు కనిపించాయి. చీకటిలో సహాయక చర్యలు కొనసాగుతుండగా, బంధువులు, స్థానికులు మృతదేహాలను చూసి విలపించారు. పది నెలల చిన్నారి మరణించిన దృశ్యం అంద‌రినీ క‌లిచి వేస్తోంది.

66
బ‌స్సు ప్ర‌మాదంపై ప‌లువురి సంతాపం
Image Credit : Pawan Kalyan Twitter

బ‌స్సు ప్ర‌మాదంపై ప‌లువురి సంతాపం

చేవెళ్ల బస్సు ప్ర‌మాదంపై ప‌లువురు సంతాపం తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాన‌ని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ప్ర‌క‌ట‌న చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీనిపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తూ.. ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ఆదుకోవాలని ట్వీట్ చేశారు.

రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరం.

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. 

పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.

ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే…

— KTR (@KTRBRS) November 3, 2025

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
హైదరాబాద్
నేరాలు, మోసాలు
తెలంగాణ
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved