MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Virat Kohli : న్యూజిలాండ్‌తో ఫైనల్ ఫైట్.. కోహ్లీ 85వ సెంచరీ లోడింగ్

Virat Kohli : న్యూజిలాండ్‌తో ఫైనల్ ఫైట్.. కోహ్లీ 85వ సెంచరీ లోడింగ్

Virat Kohli : న్యూజిలాండ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు విరాట్ కోహ్లీ ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకున్నారు. మరోవైపు అలీబాగ్‌లో రూ. 37 కోట్లతో కోహ్లీ-అనుష్క దంపతులు భారీగా భూమి కొనుగోలు చేశారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 17 2026, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండోర్ పోరుకు ముందు మహాకాలుని చెంతన కోహ్లీ.. అలీబాగ్‌లో రూ. 37 కోట్ల విలువైన భూమి కొనుగోలు!
Image Credit : Getty

ఇండోర్ పోరుకు ముందు మహాకాలుని చెంతన కోహ్లీ.. అలీబాగ్‌లో రూ. 37 కోట్ల విలువైన భూమి కొనుగోలు!

టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మైదానంలో పరుగుల వరద పారించడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. న్యూజిలాండ్‌తో జరగనున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఇండోర్ లో జరగనున్న ఈ మ్యాచ్‌లో విరాట్ తన బ్యాట్‌తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

మరోవైపు, విరాట్ కోహ్లీ, అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ భారీ మొత్తంలో ఆస్తిని కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ దంపతులు మహారాష్ట్రలోని అలీబాగ్‌లో కోట్లాది రూపాయల విలువైన భూమిని కొనుగోలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మహాకాలుని సేవలో విరాట్ కోహ్లీ
Image Credit : PTI

మహాకాలుని సేవలో విరాట్ కోహ్లీ

ఇండోర్‌లో ఆదివారం జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. శనివారం ఉదయం ఆయన ఆలయానికి చేరుకుని, భగవంతుని ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాకుండా, తెల్లవారుజామున జరిగే ప్రత్యేకమైన భస్మ హారతిలో కూడా విరాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాకాళేశ్వర్ ఆలయ నిర్వహణ కమిటీ విరాట్‌ను సత్కరించింది.

విశేషమేమిటంటే, విరాట్ కంటే ఒక రోజు ముందు, అంటే శుక్రవారం నాడు, భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, వికెట్ కీపర్ బ్యాటర్ కే.ఎల్. రాహుల్, బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ కూడా మహాకాలుని దర్శించుకున్నారు. వీరు కూడా ఉదయం 4:00 గంటలకు జరిగిన భస్మ హారతిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని ఆశీస్సులతో ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది.

Related Articles

Related image1
Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్
Related image2
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !
36
ఇండోర్ లో సిరీస్ నిర్ణయాత్మక పోరు
Image Credit : Getty

ఇండోర్ లో సిరీస్ నిర్ణయాత్మక పోరు

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం రసవత్తరంగా మారింది. సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో, ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మూడో మ్యాచ్ ఫైనల్ పోరులా మారింది. జనవరి 11న వడోదరలో జరిగిన మొదటి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించగా, రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది.

ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. మైఖేల్ బ్రేస్‌వెల్ నాయకత్వంలో సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా, కివీస్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇస్తోంది. సొంతగడ్డపై సిరీస్ చేజారకుండా చూసుకోవాలని గిల్ సేన పట్టుదలతో ఉంది.

46
కింగ్ కోహ్లీ 85వ సెంచరీపై భారీ ఆశలు
Image Credit : Getty

కింగ్ కోహ్లీ 85వ సెంచరీపై భారీ ఆశలు

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఇండోర్ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ సాధిస్తే, అది అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 85వ సెంచరీ అవుతుంది. అలాగే, వన్డే ఫార్మాట్‌లో ఇది అతని 54వ సెంచరీగా రికార్డులకెక్కుతుంది. గత ఆరు మ్యాచ్‌లలో విరాట్ ఐదు సార్లు 50కి పైగా స్కోరు సాధించారు, ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.

వడోదరలో జరిగిన మొదటి మ్యాచ్‌లో కోహ్లీ 93 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, నిర్ణయాత్మక మ్యాచ్‌లో అతను చెలరేగుతాడని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ నుండి కూడా పెద్ద ఇన్నింగ్స్‌ను జట్టు ఆశిస్తోంది.

56
అలీబాగ్‌లో రూ. 37 కోట్లతో భూమి కొనుగోలు
Image Credit : Virat Kohli\BCCI

అలీబాగ్‌లో రూ. 37 కోట్లతో భూమి కొనుగోలు

క్రికెట్ సంగతి పక్కన పెడితే, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మరోసారి రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడి పెట్టారు. మీడియా రిపోర్టుల ప్రకారం.. ఈ జంట మహారాష్ట్రలోని అలీబాగ్‌లో, ఆవాస్ బీచ్ సమీపంలోని జిరాద్ గ్రామంలో కొత్తగా భూమిని కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 14,740 చదరపు మీటర్లు అని సమాచారం.

ఈ భూమి విలువ సుమారు రూ. 37.86 కోట్లుగా చెబుతున్నారు. దీనికి అదనంగా స్టాంప్ డ్యూటీ కోసం రూ. 2.27 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 30,000 చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబై, గురుగ్రామ్‌లలో విలాసవంతమైన బంగళాలు ఉన్న కోహ్లీకి, అలీబాగ్‌లో ఇది రెండో భారీ పెట్టుబడి.

66
లండన్‌కు మకాం.. అయినా భారత్‌లో ఆస్తులు
Image Credit : AFP

లండన్‌కు మకాం.. అయినా భారత్‌లో ఆస్తులు

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు గతంలో 2022లో కూడా అలీబాగ్‌లోనే ఎనిమిది ఎకరాల భూమిని రూ. 19.24 కోట్లకు కొనుగోలు చేశారు. అక్కడ ఇప్పటికే ఒక విలాసవంతమైన బంగళాను నిర్మించుకున్నారు, ఖాళీ సమయం దొరికినప్పుడు అక్కడికి వెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ తమ కుటుంబంతో సహా లండన్‌కు షిఫ్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడటానికి లేదా వ్యక్తిగత పనుల కోసం మాత్రమే భారత్‌కు వస్తున్నారు. మిగిలిన సమయం ఎక్కువగా లండన్‌లోనే గడుపుతున్నారు. అయినప్పటికీ, భారత్‌లో ఆస్తుల మీద పెట్టుబడి పెట్టడం వారు కొనసాగిస్తున్నారు. విరాట్ తల్లి, సోదరుడు వికాస్ కోహ్లీ గురుగ్రామ్‌లోని ఇంట్లో నివసిస్తున్నారు. ఆదివారం మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్ ఝుళిపిస్తాడో లేడో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్
Recommended image2
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved