MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • రాసిపెట్టుకో.! రోహిత్, కోహ్లీనే టీమిండియా పరువు నిలబెట్టేది.. బీసీసీఐకి అల్టిమేటం

రాసిపెట్టుకో.! రోహిత్, కోహ్లీనే టీమిండియా పరువు నిలబెట్టేది.. బీసీసీఐకి అల్టిమేటం

Team India: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు టీమిండియాలో కొనసాగించాలని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించారు. వారి అనుభవం, నిలకడైన ప్రదర్శన జట్టుకు అత్యవసరం అని, వారిద్దరూ లేకుండా ప్రపంచకప్ గెలవడం కష్టమని..

2 Min read
Pavithra D
Published : Dec 02 2025, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆ ఇద్దరూ ఉండాల్సిందే
Image Credit : Facebook/Indian Cricket Team

ఆ ఇద్దరూ ఉండాల్సిందే

భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దశాబ్దాలుగా సేవలు అందిస్తూ, కీలకమైన పిల్లర్లుగా ఉన్నారు. వారి అంకితభావం, నిలకడైన ప్రదర్శన మిగిలిన ఆటగాళ్లకు మోటివేషన్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువ. ఈ క్రమంలోనే, 2027 వన్డే ప్రపంచకప్‌లో వారిద్దరూ భారత జట్టు ప్రణాళికలలో ఉంటారా లేదా అనేది పెద్ద చర్చ కొనసాగుతోంది. టీమ్ మేనేజ్‌మెంట్ లేదా బీసీసీఐ ఈ ఇద్దరు ఆటగాళ్ల భవిష్యత్తుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని సంగతి తెలిసిందే.

25
అప్పుడు ఆస్ట్రేలియా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా
Image Credit : X/BCCI

అప్పుడు ఆస్ట్రేలియా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా

అయితే, మాజీ భారత ఆటగాళ్లు మాత్రం కోహ్లీ, రోహిత్ సేవలు భారత జట్టుకు ఇంకా అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు. వారిద్దరూ లేని జట్టుతో తక్షణమే అద్భుతాలు సాధించడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. వారి కెరీర్ గురించి సోషల్ మీడియాలో చర్చించి సీనియర్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచడం సరైనది కాదని స్పష్టం చేశారు. యువ ఆటగాళ్ల కంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నిలకడగా రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో, అలాగే దక్షిణాఫ్రికాతో రాంచీలో జరిగిన వన్డే మ్యాచ్‌ కూడా వీరిద్దరి అద్భుతమైన ప్రదర్శన పరిశీలిస్తే.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు వీరిని కొనసాగించాలని అంటున్నారు.

Related Articles

Related image1
Rohit Sharma: టెస్ట్, టీ20 రిటైర్మెంట్.. రోహిత్ కు శర్మ బీసీసీఐ ఎంత జీతం ఇస్తుంది?
Related image2
టీమిండియా ఊపిరి పీల్చుకో..! టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ రీఎంట్రీ.?
35
మాజీ క్రికెటర్లు వారికే ఓటు..
Image Credit : Getty

మాజీ క్రికెటర్లు వారికే ఓటు..

ఈ విషయంలో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. రోహిత్, కోహ్లీ అద్భుతమైన ఆటగాళ్లని, వారిద్దరూ లేకపోతే 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికలు విజయవంతం కావని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచకప్ ఆడే భారత జట్టులో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఉండాల్సిందేనని, ఇందులో ఎలాంటి సందేహాలు ఉండకూడదని శ్రీకాంత్ గట్టిగా చెప్పారు. కోహ్లీ, రోహిత్ క్రీజ్‌లో 20 ఓవర్ల వరకు నిలబడితే, ప్రత్యర్థుల గెలుపు అవకాశాలు తగ్గుతాయని ఆయన వివరించారు.

45
మంచి రిథమ్‌లో ఉన్నారు..
Image Credit : Getty

మంచి రిథమ్‌లో ఉన్నారు..

రాంచీ వన్డేలో సీనియర్ల భాగస్వామ్యమే భారత్‌కు విజయం అందించిన విషయాన్ని ఆయన ఉటంకించారు. ఒకే ఫార్మాట్‌కు పరిమితమైనప్పుడు రిథమ్ కొనసాగించడం కష్టమే అయినా, వారిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని, ఫిజికల్ ఫిట్‌నెస్‌పైనా దృష్టి సారించారని శ్రీకాంత్ అన్నారు. ప్రపంచకప్ ఆడే భారత జట్టులో ఓపెనర్ స్థానాన్ని రోహిత్, మూడో స్థానాన్ని విరాట్ కోహ్లీ సుస్థిరం చేసుకున్నారని, వారిద్దరూ లేకుండా ప్రపంచకప్ గెలవడం అసాధ్యమని శ్రీకాంత్ తేల్చి చెప్పారు.

55
రోకో ప్రపంచకప్ ఆడతారు..
Image Credit : Getty

రోకో ప్రపంచకప్ ఆడతారు..

ప్రస్తుతం రోహిత్ శర్మ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ కచ్చితంగా వన్డే ప్రపంచకప్ ప్రణాళికలలో ఉండాల్సిందేనని చర్చ జరుగుతోంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల వయస్సులోనూ దూకుడుగా ఆడుతున్న టాప్ క్లాస్ ప్లేయర్ కోహ్లీ ప్రపంచకప్ ఆడితే టీమిండియాకు ఎంతో ప్రయోజనమని అభిమానులు కూడా అంటున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
446 పరుగులు, 19 సిక్సర్లు.. SMAT లో హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ విధ్వంసం
Recommended image2
ఐపీఎల్ మినీ వేలంలో 1355 మంది ప్లేయర్స్.. 45 మంది పోటుగాళ్ల పైనే ఫోకస్
Recommended image3
14 ఏళ్లకే 3 సెంచరీలు.. SMATలో వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర
Related Stories
Recommended image1
Rohit Sharma: టెస్ట్, టీ20 రిటైర్మెంట్.. రోహిత్ కు శర్మ బీసీసీఐ ఎంత జీతం ఇస్తుంది?
Recommended image2
టీమిండియా ఊపిరి పీల్చుకో..! టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ రీఎంట్రీ.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved