MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs SA : కోహ్లీ, రోహిత్‌లకు క్రెడిట్ ఇవ్వని గంభీర్‌.. ఇదెక్కడి రచ్చ సామీ !

IND vs SA : కోహ్లీ, రోహిత్‌లకు క్రెడిట్ ఇవ్వని గంభీర్‌.. ఇదెక్కడి రచ్చ సామీ !

IND vs SA : దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ విజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సరైన క్రెడిట్ ఇవ్వలేదని క్రికెట్ సర్కిల్ లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే భారత జట్టు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

3 Min read
Mahesh Rajamoni
Published : Dec 11 2025, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దక్షిణాఫ్రికా సిరీస్ విజయం తర్వాత గంభీర్ తీరుపై విమర్శలు
Image Credit : X/BCCI

దక్షిణాఫ్రికా సిరీస్ విజయం తర్వాత గంభీర్ తీరుపై విమర్శలు

టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టీమిండియా చాలానే విమర్శలు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లతో గంభీర్ కు పడటం లేదని వార్తలు వస్తున్నాయి. వన్డే సిరీస్ క్రమంలో విరాట్ కోహ్లీ గంభీర్ తో ఏం మాట్లాడకుండా వెళ్లడం మరోసారి జట్టులో ఏం జరుగుతోందని చర్చ మొదలైంది.

తాజాగా భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు గౌతమ్ గంభీర్ సరైన క్రెడిట్ ఇవ్వలేదని ఉతప్ప అభిప్రాయపడ్డారు. గంభీర్ వ్యవహరించిన తీరుపై ఉతప్ప తన అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు.

26
దక్షిణాఫ్రికా సిరీస్‌లో సీనియర్ల పాత్ర ఎలా ఉంది?
Image Credit : twitter

దక్షిణాఫ్రికా సిరీస్‌లో సీనియర్ల పాత్ర ఎలా ఉంది?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం టెస్ట్, టి20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉంటూ, కేవలం వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ బ్యాటర్లు వన్డేల్లో నిలకడగా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

అంతకుముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ సమయంలో జట్టు పరిస్థితి దారుణంగా మారింది. కానీ, వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు తిరిగి పుంజుకుంది. వీరిద్దరి రాకతో బలం పుంజుకున్న టీమిండియా, వన్డే సిరీస్ గెలవడమే కాకుండా టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

Related Articles

Related image1
Yuvraj Singh: 6 బంతుల్లో 6 సిక్సర్లే కాదు.. యువరాజ్ సింగ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Related image2
Team India : గిల్ కోసం బలిపశువుగా మారిన స్టార్ ! గంభీర్, అగార్కర్ ఏందయ్యా ఇది !
36
ఉతప్ప ఆగ్రహానికి కారణమేంటి?
Image Credit : Getty

ఉతప్ప ఆగ్రహానికి కారణమేంటి?

భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై రాబిన్ ఉతప్ప మండిపడ్డారు. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ విజయం సాధించిన తర్వాత, ఆ గెలుపు క్రెడిట్‌ను గంభీర్ రోహిత్, విరాట్‌లకు ఇవ్వలేదని ఉతప్ప ఆరోపించారు. ఈ విషయంపై తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ ఉతప్ప ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"ఆ సిరీస్‌లోని చివరి మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నాకు ఒక విషయం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. గౌతమ్ గంభీర్ ఎక్కడా కూడా రోహిత్ లేదా విరాట్‌కు విజయంలో క్రెడిట్ ను ఇవ్వడం నేను చూడలేదు," అని ఉతప్ప పేర్కొన్నారు. జట్టు విజయంలో ఇంతటి కీలక పాత్ర పోషించినా, కోచ్ వారిని ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

46
అనుమానాలను పటాపంచలు చేసిన రోహిత్, విరాట్
Image Credit : ANI + X/@CricCrazyJohns

అనుమానాలను పటాపంచలు చేసిన రోహిత్, విరాట్

ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనను ఉతప్ప కొనియాడారు. "రోహిత్, విరాట్ తమ పూర్తి సామర్థ్యంతో బ్యాటింగ్ చేశారు. వారు ఎంత గొప్ప ఆటగాళ్లో, వారు ఎంత అద్భుతంగా రాణించగలరో మనకు మరోసారి చూపించారు. వారి ఫామ్ గురించి ఉన్న అన్ని రకాల సందేహాలను వారు నివృత్తి చేశారు. వారు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు భారతదేశం కోసం నిజంగా ఏమి చేయగలరో చేసి చూపించారు. అలాంటి పరిస్థితుల్లో వారికి క్రెడిట్ ఇవ్వకపోవడం నిజంగా వింతగా అనిపించింది," అని ఉతప్ప అన్నారు. వారిద్దరూ జట్టుకు అందించిన సేవలను కోచ్ గుర్తించకపోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

56
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అసలు ఏం జరిగింది?
Image Credit : X/BCCI

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అసలు ఏం జరిగింది?

దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా గంభీర్‌ను ఒక ప్రశ్న అడిగింది. 2027 వన్డే ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతారా లేదా అని ప్రశ్నించారు. దీనికి గంభీర్ సమాధానమిస్తూ, "ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, 2027 వన్డే ప్రపంచ కప్ రావడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. జట్టులోకి వస్తున్న యువ ఆటగాళ్లు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి" అని అన్నారు. సీనియర్ల గురించి నేరుగా మాట్లాడకుండా గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.

66
భీకర ఫామ్‌లో రోహిత్, విరాట్
Image Credit : Gemini

భీకర ఫామ్‌లో రోహిత్, విరాట్

గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ, గణాంకాలు మాత్రం రోహిత్, విరాట్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని స్పష్టం చేస్తున్నాయి. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 38 ఏళ్ల రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తున్నారు.

రోహిత్ శర్మ తన చివరి ఐదు వన్డే ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలో ఏకంగా 340 పరుగులు సాధించారు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో రోహిత్ అత్యధిక స్కోరు నాటౌట్‌గా 121 పరుగులు. మరోవైపు, విరాట్ కోహ్లీ ప్రదర్శన మరింత అద్భుతంగా ఉంది. 

విరాట్ తన చివరి ఐదు వన్డే ఇన్నింగ్స్‌లలో 376 పరుగులు చేశారు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో విరాట్ అత్యధిక స్కోరు 135 పరుగులు. వీరిద్దరూ ఇంతటి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, కోచ్ నుండి సరైన ప్రశంసలు రాకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Yuvraj Singh: 6 బంతుల్లో 6 సిక్సర్లే కాదు.. యువరాజ్ సింగ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Team India : గిల్ కోసం బలిపశువుగా మారిన స్టార్ ! గంభీర్, అగార్కర్ ఏందయ్యా ఇది !
Recommended image3
Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Related Stories
Recommended image1
Yuvraj Singh: 6 బంతుల్లో 6 సిక్సర్లే కాదు.. యువరాజ్ సింగ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Team India : గిల్ కోసం బలిపశువుగా మారిన స్టార్ ! గంభీర్, అగార్కర్ ఏందయ్యా ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved