MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • 4 వన్డేల్లో ఒక్క విజయం.. ఆ మైదానం పేరు వింటేనే టీమిండియా సుస్సుపోయాల్సిందే

4 వన్డేల్లో ఒక్క విజయం.. ఆ మైదానం పేరు వింటేనే టీమిండియా సుస్సుపోయాల్సిందే

Team India: భారత్-న్యూజిలాండ్ రెండో వన్డేకు రాజ్ కోట్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఈ మైదానంలో టీమిండియా రికార్డులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు నాలుగు వన్డేలాడి కేవలం ఒక విజయం మాత్రమే సాధించింది. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

2 Min read
Author : Pavithra D
Published : Jan 13 2026, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెండో వన్డేకు అంతా సిద్దం..
Image Credit : Team India/BCCI

రెండో వన్డేకు అంతా సిద్దం..

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో వన్డేకు రాజ్‌కోట్ సిద్దమైంది. అయితే, ఈ మైదానంపై టీమిండియా రికార్డులు జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతున్నాయి. రాజ్‌కోట్‌లో భారత జట్టు ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడి, ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్‌తో రాజ్‌కోట్‌లో భారత్ తొలిసారి వన్డే మ్యాచ్ ఆడబోతోంది.

25
గత రికార్డులు ఇలా..
Image Credit : Team India\BCCI

గత రికార్డులు ఇలా..

గత రికార్డులను పరిశీలిస్తే, భారత్ 2013లో ఇంగ్లాండ్‌తో తొలి వన్డే ఆడింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్లకు 325 పరుగులు చేయగా, టీమిండియా తొమ్మిది వికెట్లకు 316 పరుగులు చేసి తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 11 పరుగులకే పరిమితం కాగా, గౌతమ్ గంభీర్ 52, యువరాజ్ సింగ్ 61, సురేష్ రైనా 50 పరుగులు సాధించారు.

Related Articles

Related image1
రాసిపెట్టుకోండి.! చిన్నస్వామి స్టేడియానికి ఇక కోహ్లీ రానట్లే.? కొత్త గ్రౌండ్ కోసం వెతుకులాట..
Related image2
'టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించి.. కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఆడుతున్నాడు..' : మాజీ క్రికెటర్
35
ఆ తర్వాత ఇలా..
Image Credit : Getty

ఆ తర్వాత ఇలా..

2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్వింటన్ డికాక్ సెంచరీ, డుప్లెసిస్ హాఫ్ సెంచరీతో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లకు 270 పరుగులు చేయగా.. భారత్ తరపున రోహిత్ శర్మ 65, విరాట్ కోహ్లీ 77 పరుగులతో ఆరు వికెట్లకు 252 పరుగులు మాత్రమే చేసింది.

45
ఆస్ట్రేలియాపై విజయం..
Image Credit : Getty

ఆస్ట్రేలియాపై విజయం..

టీమిండియా ఏకైక విజయాన్ని 2020లో ఆస్ట్రేలియాపై సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లకు 340 పరుగులు చేయగా, ధావన్ 96, కేఎల్ రాహుల్ 80, కోహ్లీ 78, రోహిత్ 42 పరుగులు చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా 304 పరుగులకు ఆలౌట్ అయింది. చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా ఏడు వికెట్లకు 352 పరుగులు చేయగా.. రోహిత్ 81, కోహ్లీ 56 పరుగులు చేసినా భారత్ 286 పరుగులకు ఆలౌట్ అయింది.

55
వ్యక్తిగత ప్రదర్శనలు ఇలా..
Image Credit : Getty

వ్యక్తిగత ప్రదర్శనలు ఇలా..

రాజ్‌కోట్‌లో విరాట్ కోహ్లీకి మంచి రికార్డ్ ఉంది. అతను నాలుగు ఇన్నింగ్స్‌లలో 226 పరుగులు(సగటు 56.50) సాధించి, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ మూడు ఇన్నింగ్స్‌లలో 188 పరుగులు (సగటు 62.66) చేసి రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లలో 106 పరుగులు(సగటు 53) చేయగా, రవీంద్ర జడేజా మూడు ఇన్నింగ్స్‌లలో 62 పరుగులు, శ్రేయస్ అయ్యర్ రెండు ఇన్నింగ్స్‌లలో 55 పరుగులు సాధించారు. బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు తీయగా, మహమ్మద్ షమీ మూడు వికెట్లు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli : అహంకారం కాదురా.. అది ఆటిట్యూడ్.. రహానే షాకింగ్ కామెంట్స్
Recommended image2
Virat Kohli : జస్ట్ 1 రన్.. సచిన్ రికార్డ్ ఫట్.. కోహ్లీ మాస్ రచ్చ!
Recommended image3
RCB : ఆర్సీబీ మాస్ బ్యాటింగ్.. యూపీ బౌలర్లకు చుక్కలే ! గ్రేస్ హారిస్ సునామీ ఇన్నింగ్స్
Related Stories
Recommended image1
రాసిపెట్టుకోండి.! చిన్నస్వామి స్టేడియానికి ఇక కోహ్లీ రానట్లే.? కొత్త గ్రౌండ్ కోసం వెతుకులాట..
Recommended image2
'టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించి.. కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఆడుతున్నాడు..' : మాజీ క్రికెటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved