MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి గంభీర్ షాక్

తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి గంభీర్ షాక్

India South Africa Test: దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ముందు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి గంభీర్ షాక్ ఇచ్చాడు. అతన్ని భారత జట్టు నుంచి అవుట్ చేశారు. నితీష్ ఇప్పుడు ఇండియా ‘A’ జట్టుతో రాజ్‌కోట్‌లో ఆడనున్నారు.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 12 2025, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నితీష్ కుమార్ రెడ్డి అవుట్.. కోల్‌కతా టెస్ట్‌కు ముందు గంభీర్ నిర్ణయం
Image Credit : X/NKReddy07

నితీష్ కుమార్ రెడ్డి అవుట్.. కోల్‌కతా టెస్ట్‌కు ముందు గంభీర్ నిర్ణయం

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గౌతమ్ గంభీర్ తెలుగు ప్లేయర్ కు షాక్ ఇచ్చాడు. నవంబర్ 14న కోల్‌కతాలో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి ఔట్ చేశారు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌ టెన్‌ విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

26
కోల్‌కతా టెస్ట్‌కు ముందు మార్పులు ఎందుకు?
Image Credit : X/NKReddy07

కోల్‌కతా టెస్ట్‌కు ముందు మార్పులు ఎందుకు?

గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న రిషభ్ పంత్ తిరిగి రావడంతో జట్టులో బ్యాటింగ్ కాంబినేషన్ మారింది. ధ్రువ్ జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడనున్నందున నితీష్‌ కుమార్ కు తొలి టెస్టులో స్థానం లభించలేదు. ఫలితంగా, గంభీర్ ఆధ్వర్యంలోని కోచ్ బృందం అతన్ని ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో కాకుండా, ప్రాక్టీస్, ఫిట్‌నెస్ పెంపొందించే ఉద్దేశంతో ఇండియా ‘A’ జట్టుకు పంపించారు.

Related Articles

Related image1
ఆర్సీబీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. చిన్నస్వామికి గుడ్‌బై ! కోహ్లీ కొత్త హోమ్ గ్రౌండ్ ఏది?
Related image2
గువాహటి టెస్ట్‌లో కొత్త ప్రయోగం.. లంచ్‌కు ముందే టీ బ్రేక్
36
రాజ్‌కోట్‌లో ఇండియా ‘A’ జట్టుతో ఆడనున్న నితీష్ కుమార్ రెడ్డి
Image Credit : X/NKReddy07

రాజ్‌కోట్‌లో ఇండియా ‘A’ జట్టుతో ఆడనున్న నితీష్ కుమార్ రెడ్డి

నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు తిలక్ వర్మ సారథ్యంలో ఆడుతున్న ఇండియా ‘A’ వర్సెస్ దక్షిణాఫ్రికా ‘A’ లిస్ట్ ‘A’ సిరీస్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే రాజ్‌కోట్‌లో జట్టుతో కలిసిన నితీష్, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. ఇది అతనికి గాయం తర్వాత మ్యాచ్ ఫిట్‌నెస్ తిరిగి పొందేందుకు మంచి అవకాశం అవుతుందని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

46
గాయాల తర్వాత పునరాగమనంలో నితీష్
Image Credit : X/NKReddy07

గాయాల తర్వాత పునరాగమనంలో నితీష్

22 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో గాయాలతో సతమతమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించినప్పటికీ, క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా T20 సిరీస్ మిస్ అయ్యాడు. తర్వాత మెడ నొప్పులు అతని ఫిట్‌నెస్‌ను ప్రభావితం చేశాయి. ఇప్పుడు అతన్ని రెడ్ బాల్ క్రికెట్‌లో బెంచ్ చేయకుండా, మ్యాచ్ ప్రాక్టీస్‌కి అవకాశం ఇవ్వడం ద్వారా యాజమాన్యం అతని రిథమ్ తిరిగి వచ్చేలా చూస్తోంది.

56
భారత జట్టు ప్రస్తుత టెస్ట్ స్క్వాడ్ ఇదే
Image Credit : X/BCCI

భారత జట్టు ప్రస్తుత టెస్ట్ స్క్వాడ్ ఇదే

భారత టెస్ట్ జట్టు (దక్షిణాఫ్రికా సిరీస్)

బ్యాటర్లు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్

వికెట్ కీపర్: రిషభ్ పంత్

ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్

బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్

ఈ స్క్వాడ్‌లో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి స్థిరమైన ఆల్‌రౌండర్లు ఉన్నందున, నితీష్‌కు ప్రస్తుతం అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

66
ఈ నిర్ణయం వెనుక వ్యూహాత్మక కారణాలు
Image Credit : X/BCCI

ఈ నిర్ణయం వెనుక వ్యూహాత్మక కారణాలు

టీమిండియా యాజమాన్యం దీన్ని పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయంగా తీసుకుంది. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్‌లకు సరిపోయే పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్‌ కుమార్ ను తీర్చిదిద్దాలని మేనేజ్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. హార్దిక్ పాండ్యా తరచుగా గాయపడుతున్న సందర్భంలో, రాబోయే సిరీస్‌లకు నితీష్ రెడ్డిని సిద్ధం చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక నితీష్‌కు ఇండియా ‘A’ తరపున 50 ఓవర్ల క్రికెట్‌లో అనుభవం పెరిగితే, భవిష్యత్తులో సీనియర్ జట్టులో తిరిగి అవకాశం రావడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved