MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL 2025 కోహ్లీ నుండి అయ్యర్ దాకా.. బ్యాటింగ్ లో దుమ్ముదులిపేది ఎవరంటే..?

IPL 2025 కోహ్లీ నుండి అయ్యర్ దాకా.. బ్యాటింగ్ లో దుమ్ముదులిపేది ఎవరంటే..?

కొద్దిరోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. పరుగులు, వికెట్లు, అభిమానుల సందడితో మైదానాలు హోరెత్తనున్నాయి. వీటన్నింటితోపాటు సహజంగానే ఎవరు ఎక్కువ రన్స్ చేస్తారోనని అంతా ఉత్సుకతతో ఎదురుచూడటం సహజం. క్రికెట్ పండితుల అంచనా ప్రకారం ఈ బ్యాటర్లు అత్యధిక పరుగులతో దుమ్ము దులపనున్నారు. 

3 Min read
Anuradha B
Published : Mar 15 2025, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఎవరు మొనగాళ్లు?

ఎవరు మొనగాళ్లు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభానికి కొద్దిరోజులే ఉంది. దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈడెన్ గార్డెన్స్‌లో తలపడుతుంది.

2008లో టోర్నమెంట్ మొదటి ఎడిషన్ నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బ్యాటర్లు తమ జట్ల గెలుపులో కీలక పాత్ర పోషించారు. చాలా మంది పరుగుల పట్టికలో స్థిరంగా ఆధిపత్యం చెలాయించారు.

ఐతే, ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు చేసే ఆటగాళ్లుగా ఎవరు ఉండొచ్చో ఇప్పుడు చూద్దాం.

27

1. విరాట్ కోహ్లీ 

విరాట్ కోహ్లీ గత ఏడాది అదరగొట్టాడు. 2016 తర్వాత మొదటిసారిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2024లో కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2023లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ 14 మ్యాచ్‌ల్లో 53.25 సగటుతో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో 639 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో కోహ్లీ 600 పరుగులు చేశాడు. రాబోయే ఐపీఎల్ సీజన్‌లోనూ నిలకడగా రాణిస్తే, కోహ్లీ రెండోసారి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవచ్చు. కెప్టెన్సీ భారం లేకపోవడం, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మంచి విరామం దొరకడంతో కోహ్లీ ఐపీఎల్ 2025లో రెచ్చిపోవడం ఖాయం.

37

2. శుభ్‌మన్ గిల్ 

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ 2023లో 17 మ్యాచ్‌ల్లో 59.33 సగటుతో 890 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అయితే, ఆ తర్వాత ఏడాదిలో అంతగా రాణించలేదు. 12 మ్యాచ్‌ల్లో 38.73 సగటుతో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 426 పరుగులు చేశాడు. గత ఐపీఎల్ సీజన్లలో గిల్ స్థిరంగా 400 పైగా పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2023లో రాణించినట్టే రాణిస్తే, ఐపీఎల్ 2025లో టాప్ రన్ గెటర్స్‌లో ఒకడిగా ఉంటాడు. కెప్టెన్సీ భారం తన ఆటపై పడకుండా చూసుకోవాలి. తన నాయకత్వ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తే, శుభ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో టాప్ రన్ గెటర్స్‌లో ఒకడిగా నిలుస్తాడు.

47

3. రచిన్ రవీంద్ర 

ఐపీఎల్ 2025లో టాప్ రన్ గెటర్స్‌లో ఒకడిగా నిలిచే అవకాశం ఉన్న మరో ఆటగాడు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర. రచిన్ గత సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 10 మ్యాచ్‌ల్లో 22.20 సగటుతో ఒక హాఫ్ సెంచరీతో 222 పరుగులు చేశాడు. 24 ఏళ్ల ఈ ఆటగాడు గత ఏడాదిగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 4 మ్యాచ్‌ల్లో 65.75 సగటుతో రెండు సెంచరీలతో 263 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్రకు భారత పిచ్‌ల గురించి బాగా తెలుసు. వన్డే ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేసి 3 సెంచరీలతో 578 పరుగులు చేశాడు. రాబోయే ఐపీఎల్ సీజన్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, రచిన్ స్టార్ అవుతాడు.

57

4. యశస్వి జైస్వాల్ 

రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో టాప్ రన్ గెటర్‌గా నిలిచే అవకాశం ఉంది. జైస్వాల్ 2023లో 14 మ్యాచ్‌ల్లో 48.08 సగటుతో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 625 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏడాదిలో 15 మ్యాచ్‌ల్లో 31.07 సగటుతో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 435 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లుగా యశస్వి జైస్వాల్ నిలకడగా రాణిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. గత కొన్నేళ్లుగా జైస్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో నిలకడగా ఆడితే, టాప్ రన్ గెటర్‌గా నిలిచే సత్తా ఉంది.

 

67

5. అభిషేక్ శర్మ 

అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో దూకుడుగా ఆడే ఆటగాడిగా ఎదిగాడు. గత నెలలో ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో  135 పరుగులు చేశాడు. 24 ఏళ్ల ఈ ఆటగాడు టీ20ల్లో తన సత్తా చాటుతున్నాడు. గత ఏడాది ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో 32.26 సగటుతో 484 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ట్రావిస్ హెడ్‌తో కలిసి ఓపెనింగ్‌లో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. తన పవర్ హిట్టింగ్ సామర్థ్యంతో అభిషేక్ శర్మ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో టాప్ రన్ గెటర్స్‌లో ఒకడిగా నిలవచ్చు.

77

6. శ్రేయాస్ అయ్యర్ 

పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అదరగొట్టాడు. గత ఏడాది ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌ల్లో 39 సగటుతో 351 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ 2025 వేలానికి ముందు కేకేఆర్‌ అతడిని రిలీజ్ చేసింది. పంజాబ్ కింగ్స్ అతడిని భారీ మొత్తం రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. శ్రేయాస్ అయ్యర్ మిడిలార్డర్ బ్యాటరే అయినా, ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆడే సత్తా ఉంది. రాబోయే సీజన్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో టాప్ రన్ గెటర్స్‌లో ఒకడిగా నిలుస్తాడు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ
శుభ్‌మన్ గిల్
క్రికెట్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved