MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • ప్రధాని మోదీతో భారత ఛాంపియన్ ప్లేయర్లు.. స్పెషల్ గిఫ్ట్ !

ప్రధాని మోదీతో భారత ఛాంపియన్ ప్లేయర్లు.. స్పెషల్ గిఫ్ట్ !

India Women Team Meets PM Modi : ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2025 విజేత భారత మహిళా జట్టు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. టీమిండియా ప్లేయర్లు సంతకాలు చేసిన ప్రత్యేకమైన 'నమో 1' జెర్సీని ప్రధానికి అందజేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 05 2025, 10:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఢిల్లీలో ప్రధాని మోడీతో భారత మహిళా జట్టు
Image Credit : Asianet News

ఢిల్లీలో ప్రధాని మోడీతో భారత మహిళా జట్టు

ప్రపంచ కప్ గెలుపు తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు ఢిల్లీకి చేరుకుంది. నవీ ముంబైలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్ తన తొలి మహిళా ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయానంతరం బుధవారం (నవంబర్ 5) సాయంత్రం జట్టు ప్రధాని నివాసమైన 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది.

ప్రధాని మోదీ జట్టుకు స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు. మహిళా క్రీడాకారిణుల పోరాటస్ఫూర్తి, కృషి, దేశానికి గౌరవం తీసుకువచ్చిన అద్భుత ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2017 జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్
Image Credit : Asianet News

2017 జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. “2017లో మేము ట్రోఫీ లేకుండా ప్రధాని గారిని కలిశాం. ఈసారి ట్రోఫీతో వచ్చాం, ఇది మాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఎంతో గౌరవం కూడా.. ఇలాంటి విజయ క్షణాలు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాం” అన్నారు.

వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కూడా ప్రధానమంత్రిని ప్రేరణాత్మక నాయకుడిగా వర్ణించారు. “ప్రధాని మాటలు ఎప్పుడూ మాకు ఉత్తేజాన్నిస్తాయి. ఆయన ప్రోత్సాహం ప్రతి క్రీడాకారిణికి స్ఫూర్తి” అని అన్నారు.

Related Articles

Related image1
అద్భుత ఫామ్‌లో అభిషేక్ శర్మ.. కోహ్లీ రికార్డులు బద్దలు
Related image2
స్టార్ ప్లేయర్ కు షాక్.. మళ్లీ తిరిగొస్తున్న బిగ్ హిట్టర్.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టు ఇదే
35
దీప్తి శర్మ పై ప్రధాని ప్రశంసలు
Image Credit : Asianet News

దీప్తి శర్మ పై ప్రధాని ప్రశంసలు

టోర్నమెంట్‌లో టాప్ ప్లేయర్ గా నిలిచిన దీప్తి శర్మ పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. దీప్తీ మాట్లాడుతూ.. “2017లో ప్రధాని నాకు కష్టపడి పనిచేయి, కల నెరవేరుతుందని చెప్పారు. నిజంగానే ఈరోజు కల నెరవేరింది” అని చెప్పారు.

ప్రధాని మోదీ దీప్తి శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఉన్న “జయ శ్రీరామ్” వ్యాఖ్యానాన్ని, అలాగే ఆమె చేయి మీద ఉన్న హనుమాన్ టాటూను ప్రస్తావించారు. దీప్తి నవ్వుతూ, “నా భక్తి నాకెప్పుడూ బలం ఇస్తుంది” అని అన్నారు.

45
ప్రధానికి ప్రత్యేక కానుక: నమో 1 జెర్సీ
Image Credit : Asianet News

ప్రధానికి ప్రత్యేక కానుక: నమో 1 జెర్సీ

ఈ సమావేశంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత జట్టు ప్రధానమంత్రికి ప్రత్యేక బహుమతి అందజేసింది. అదే ‘నమో 1’ జెర్సీ. అందరూ ప్లేయర్లు సంతకం చేసిన భారత జెర్సీ ఇది. ఇది జట్టు తరఫున ప్రధానికి గౌరవం, కృతజ్ఞతల సూచికగా దీనిని అందించారు.

ప్రధాని మోదీ ఈ జెర్సీని స్వీకరిస్తూ, “మీ అందరి కృషి దేశాన్ని గర్వపడేలా చేసింది. భారత మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగుతున్నారనే దానికి మీ విజయమే ఉదాహరణ” అని అన్నారు. జట్టు సభ్యులు ప్రధానమంత్రితో ఆత్మీయంగా మాట్లాడారు, ఫోటోలు దిగారు.

55
భారత మహిళా జట్టుకు ఘన స్వాగతం
Image Credit : Asianet News

భారత మహిళా జట్టుకు ఘన స్వాగతం

ఢిల్లీకి చేరుకున్న భారత జట్టుకు తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ఘన స్వాగతం లభించింది. పూలమాలలు, డోలు వాయిద్యాలతో జట్టుకు స్వాగతం పలికారు. జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, స్నేహ రాణా డోలు సౌండ్ కు డాన్స్ చేశారు. కోచ్ అమోల్ మజుమ్దార్‌తో సహా అందరూ సభ్యులు విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

ప్రధాని మోదీ ఈ విజయాన్ని దేశ కుమార్తెల శక్తిగా అభివర్ణించారు. మహిళా క్రీడాకారిణుల కృషి భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభించిందని ప్రధాని అన్నారు.

భారత జట్టు 2005, 2017 ఫైనల్స్‌లో టైటిల్ దక్కించుకోలేకపోయినా, 2025లో విజయం సాధించడం చారిత్రాత్మకం. త్వరలోనే ఢిల్లీలో ‘విజయ్ పరేడ్’ నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
నరేంద్ర మోదీ
మహిళల క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image2
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image3
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Related Stories
Recommended image1
అద్భుత ఫామ్‌లో అభిషేక్ శర్మ.. కోహ్లీ రికార్డులు బద్దలు
Recommended image2
స్టార్ ప్లేయర్ కు షాక్.. మళ్లీ తిరిగొస్తున్న బిగ్ హిట్టర్.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టు ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved