- Home
- Sports
- Team India: ఐర్లాండ్తో సిరీస్.. కెప్టెన్గా శాంసన్, ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ.? ఇక ఊహకందని ఊచకోతే
Team India: ఐర్లాండ్తో సిరీస్.. కెప్టెన్గా శాంసన్, ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ.? ఇక ఊహకందని ఊచకోతే
Team India: జూన్ 2026లో జరగనున్న టీమిండియా, ఐర్లాండ్ టీ20 సిరీస్కు సంబంధించి బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. సంజు శాంసన్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉన్న ఈ సిరీస్ షెడ్యూల్, జట్టులో జరగబోయే మార్పులు ఇలా ఉన్నాయి.

టీమిండియా ఐర్లాండ్ పర్యటన..
2026 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత క్రికెట్ జట్టు తన తదుపరి పోరుకు సిద్ధమవుతోంది. జూన్ 2026లో టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ రెండు టీ20 మ్యాచ్లు ఆడనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత్ బెల్ ఫాస్ట్ మైదానంలో అడుగుపెట్టబోతుండటం విశేషం.
షెడ్యూల్ వివరాలు
మొదటి టీ20: జూన్ 26, 2026 - రాత్రి 7.30 గంటలకు(ఇండియన్ టైం) బెల్ ఫాస్ట్ స్టేడియంలో
రెండో టీ20: జూన్ 28, 2026 - రాత్రి 7.30 గంటలకు(ఇండియన్ టైం) బెల్ ఫాస్ట్ స్టేడియంలో
కెప్టెన్సీ, జట్టులో మార్పులు
ఐర్లాండ్ లాంటి చిన్న జట్లతో ఆడేటప్పుడు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం బీసీసీఐ ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను ఈ సిరీస్ కు కెప్టెన్గా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో సీనియర్ల గైర్హాజరీలో జట్టులో సభ్యుడిగా ఉన్న సంజూ, ఇప్పుడు తన అనుభవంతో జట్టును ముందుండి నడిపించే ఛాన్స్ దక్కించుకోబోతున్నాడు.
ఓపెనర్లుగా జైస్వాల్, వైభవ్
మరోవైపు, బిజీ షెడ్యూల్ కారణంగా సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మలకు ఈ పర్యటన నుండిచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. వారి స్థానంలో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ లేదా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్.
బిజీ షెడ్యూల్
ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు అఫ్ఘనిస్తాన్ తో ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ 20న అఫ్ఘనిస్తాన్ సిరీస్ ముగియగానే వెంటనే ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే జూలై 1 నుంచి ఇంగ్లాండ్ లో ఐదు టీ20లు, మూడు వన్డేల భారీ సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ సిరీస్ భారత యువ జట్టుకు ఒక మంచి సన్నాహకంగా మారనుంది.

