MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • IPL : 9.20 కోట్ల ఆటగాడిని తీసేస్తే ఊరుకోం.. ఐపీఎల్ పై బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం

IPL : 9.20 కోట్ల ఆటగాడిని తీసేస్తే ఊరుకోం.. ఐపీఎల్ పై బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం

India vs Bangladesh : ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ జట్టు నుండి తొలగించడంతో ఆగ్రహించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలపై నిరవధిక నిషేధం విధించింది. టీ20 ప్రపంచ కప్ తాము ఆడే గ్రౌండ్ లను కూడా మార్చాలని ఐసీసీని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 05 2026, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బీసీసీఐ vs బంగ్లాదేశ్: ముదురుతున్న వివాదం.. ఐసీసీకి తలనొప్పి.. ఐపీఎల్ కు షాక్ !
Image Credit : stockPhoto

బీసీసీఐ vs బంగ్లాదేశ్: ముదురుతున్న వివాదం.. ఐసీసీకి తలనొప్పి.. ఐపీఎల్ కు షాక్ !

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నుండి తొలగించడం ఇప్పుడు అంతర్జాతీయ వివాదంగా మారింది. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రసారాలు, ప్రచార కార్యక్రమాలపై తమ దేశంలో నిరవధిక నిషేధం విధించింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, బీసీసీఐ ఆదేశాల మేరకు అతన్ని జట్టు నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ చర్యను అవమానకరంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, తక్షణమే ఐపీఎల్ టెలికాస్ట్‌ను బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్రభుత్వ ఆగ్రహం.. ఐపీఎల్ ప్రసారాలపై వేటు
Image Credit : Getty

ప్రభుత్వ ఆగ్రహం.. ఐపీఎల్ ప్రసారాలపై వేటు

ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడం వెనుక బీసీసీఐ హస్తం ఉందని బంగ్లాదేశ్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం తమ ప్రజలను బాధించిందని, వారి మనోభావాలను దెబ్బతీసిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఐపీఎల్‌కు సంబంధించిన మ్యాచ్‌లు, ప్రచార కార్యక్రమాలు లేదా ఈవెంట్ కవరేజీని బంగ్లాదేశ్‌లో ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ముస్తాఫిజుర్ తొలగింపుతో ప్రజల్లో నెలకొన్న ఆక్రోశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో బంగ్లాదేశ్ టీవీ చానెల్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఐపీఎల్ సందడి పూర్తిగా నిలిచిపోనుంది.

Related Articles

Related image1
IND vs NZ: సచిన్ టు కోహ్లీ.. న్యూజిలాండ్‌పై పరుగుల వరద పారించిన టాప్-5 బ్యాటర్లు !
Related image2
Top 5 Bowlers in T20I : క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మనోడే టాప్ !
36
టీ20 ప్రపంచ కప్ బహిష్కరణ దిశగా బంగ్లాదేశ్?
Image Credit : Getty

టీ20 ప్రపంచ కప్ బహిష్కరణ దిశగా బంగ్లాదేశ్?

ఈ వివాదం కేవలం ఐపీఎల్ ప్రసారాల నిషేధంతో ఆగిపోలేదు. దీని ప్రభావం రాబోయే ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2026 పై కూడా పడింది. భద్రతా కారణాలు, ప్రభుత్వ సలహాను ఉటంకిస్తూ, ప్రపంచ కప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నిర్ణయించింది. దీనిపై అధికారిక వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది.

ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ నుంచి అకస్మాత్తుగా వైదొలిగిన తర్వాత, శనివారం రాత్రి బీసీబీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కీలక సమావేశంలో, జాతీయ జట్టు భారత్‌లో పర్యటించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ముస్తాఫిజుర్‌ను తొలగించడం వెనుక ప్రస్తుతం ఉన్న భారత్-బంగ్లాదేశ్ సంబంధాల ప్రభావం ఉందని బోర్డు భావిస్తోంది.

46
ఐసీసీకి బంగ్లాదేశ్ విజ్ఞప్తి
Image Credit : Getty

ఐసీసీకి బంగ్లాదేశ్ విజ్ఞప్తి

భారత్‌లో ఆడటానికి నిరాకరించిన బీసీబీ, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని కోరింది. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ గ్రూప్-సిలో ఉంది. ఇందులో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ జట్లు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు లీగ్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరగాల్సి ఉంది. ఇందులో మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో, ఒక మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో షెడ్యూల్ చేశారు.

అయితే, చివరి నిమిషంలో గ్రౌండ్ ను మార్చడం అంత సులభం కాదు. దీనిపై ఐసీసీ ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. దీని వెనుక అనేక క్లిష్టమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా లాజిస్టిక్ సవాళ్లు, టోర్నమెంట్ షెడ్యూల్‌ను మార్చడం ఐసీసీకి పెద్ద తలనొప్పిగా మారనుంది.

56
ఐసీసీ ముందున్న సవాళ్లు
Image Credit : Getty

ఐసీసీ ముందున్న సవాళ్లు

ప్రపంచ కప్ ప్రారంభానికి కేవలం 30 రోజుల సమయం మాత్రమే ఉండటంతో, గ్రౌండ్ ల మార్పు సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో సహ హోస్ట్ అయిన బీసీసీఐ పాత్ర కీలకం కానుంది. ఐసీసీ త్వరలో అంతర్గత సమావేశాలు నిర్వహించనుంది. అయితే, ఇది బీసీబీ, బీసీసీఐ మధ్య ద్వైపాక్షిక సమస్య అనీ, ఇందులో ఐసీసీ జోక్యం చేసుకోవడం సబబు కాదని అధికారులు భావించే అవకాశం ఉంది.

ఒకవేళ మ్యాచ్‌ల ప్లేస్ లను మార్చాల్సి వస్తే, అది కేవలం లీగ్ దశకే పరిమితం కాదు. బంగ్లాదేశ్ సూపర్-8 లేదా అంతకంటే ముందుకు వెళ్తే, మొత్తం టోర్నమెంట్ షెడ్యూల్‌ను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. ఇది ఇతర జట్ల ప్రయాణ ప్రణాళికలను కూడా దెబ్బతీస్తుంది. మరోవైపు, ఈ అంశంపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

66
ముస్తాఫిజుర్ మానసిక స్థితిపై ఆందోళన
Image Credit : Getty

ముస్తాఫిజుర్ మానసిక స్థితిపై ఆందోళన

ఐపీఎల్ నుంచి తనను తప్పించడంతో ముస్తాఫిజుర్ రెహమాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని అతని సహచర ఆటగాడు వెల్లడించాడు. జనవరి 3న కేకేఆర్, బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం అతనిని కృంగదీసిందని రంగ్‌పూర్ రైడర్స్ కెప్టెన్ నూరుల్ హసన్ తెలిపాడు. "ముస్తాఫిజుర్ ఒక ప్రపంచ స్థాయి బౌలర్. అతను ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం అతనిని లోపల విరిచేసింది. అతను దీనికంటే మెరుగైన దానికి అర్హుడు" అని నూరుల్ వ్యాఖ్యానించాడు.

కేకేఆర్ నుంచి విడుదలైన మరుసటి రోజే, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో తన జట్టుకు చివరి ఓవర్‌లో ముస్తాఫిజుర్ అద్భుత విజయాన్ని అందించాడని నూరుల్ గుర్తు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం క్రీడా రంగాన్ని దాటి, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
IND vs NZ: సచిన్ టు కోహ్లీ.. న్యూజిలాండ్‌పై పరుగుల వరద పారించిన టాప్-5 బ్యాటర్లు !
Recommended image2
Top 5 Bowlers in T20I : క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మనోడే టాప్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved