- Home
- Life
- Spiritual
- Tirupati Train : హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగంలకు ఒకే ట్రైన్.. టైమింగ్స్ ఇవే..!
Tirupati Train : హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగంలకు ఒకే ట్రైన్.. టైమింగ్స్ ఇవే..!
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త వీక్లీ రైలు సర్వీసును ప్రకటించింది ఇండియన్ రైల్వే.

హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం కు డైరెక్ట్ ట్రైన్
దక్షిణ భారత యాత్రలు ఇష్టపడే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుండి తిరుపతికి నిత్యం వేలాదిమంది ప్రయాాణిస్తుంటారు… తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా వెళ్లినవారు దగ్గర్లోని అరుణాచలంకు కూడా వెళుతుంటారు. అయితే ఈ పుణ్యక్షేత్రాలను కలుపుతూ చర్లపల్లి – తిరుచిరాపల్లి మధ్య స్పెషల్ ట్రైన్ నడిచేది.. ఇప్పుడు ఈ రైలును శాశ్వత వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చారు. దక్షిణ మధ్య రైల్వే ప్రకారం 17077, 17078 నంబర్లతో కూడిన ఈ రైలు జూలై 7 నుంచి రెగ్యులర్గా నడవనుండి.
సాధారణంగా తెలుగు ప్రజలు తిరుపతితో పాటు అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను సందర్శిస్తుంటారు. అయితే ఇంతకుముందు హైదరాబాద్ నుండి ఈ మూడు ఆలయాలను కలుపుతూ రైలు సర్వీస్ లేదు.. దీంతో భక్తులు వివిధ రైళ్లు మారుతూ అవస్థలు పడేవారు. దీంతో ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా కుటుంబాలతో వెళ్లేవారికి డైరెక్ట్ కనెక్టివిటీ లేకపోవడం పెద్ద సమస్య. ఇది గుర్తించిన రైల్వే విభాగం ఈ మూడు ఆలయాలను కలిపుతూ ఓ వీక్లీ ట్రైన్ వేసింది... అంటే ఇప్పుడు ఒకే రైలు తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను చుట్టేసి వస్తుందన్నమాట.
చర్లపల్లి-తిరుచిరాపల్లి ఎక్స్ ప్రెస్..
17077 నంబర్ గల చర్లపల్లి – తిరుచిరాపల్లి ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం 8.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఏడుకొండలస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ కొత్త వీక్లీ సర్వీసు ఆ ఇబ్బందులన్నింటినీ దూరం చేస్తుంది.
ఆ తర్వాత ఈ రైలు రేణిగుంట, చిత్తూరు, కాట్పాడి, అరుణాచలం (తిరువణ్ణామలై) మీదుగా వెళ్తుంది. అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి విల్లుపురం, వృద్ధాచలం, అరియలూర్, శ్రీరంగం మీదుగా బుధవారం సాయంత్రం 6.45 గంటలకు తిరుచిరాపల్లి చేరుకుంటుంది. అంటే శ్రీరంగం శ్రీరంగనాథస్వామిని కూడా దర్శించుకోవచ్చు.
తిరుచిరాపల్లి-చర్లపల్లి రిటర్న్ జర్నీ
తిరుగు ప్రయాణంలో 17078 నంబర్ రైలు ప్రతి బుధవారం రాత్రి 9.30 గంటలకు బయలుదేరుతుంది. శ్రీరంగం, అరుణాచలం, తిరుపతి మీదుగా ప్రయాణించి గురువారం రాత్రికి చర్లపల్లి చేరుకుంటుంది. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్లతో నడిచే ఈ సర్వీసు, కేవలం సాధారణ రైలుగానే కాకుండా దక్షిణ భారతదేశ భక్తి పర్యాటకానికి ఒక కొత్త యాత్రా మార్గంగా మారుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.
