- Home
- Life
- Spiritual
- Puri Jagannath: సముద్రం పక్కనే ఉన్నా ఆ గుడిలో అలల శబ్ధం వినిపించదు..సైన్స్ కి అందని అద్భుతం
Puri Jagannath: సముద్రం పక్కనే ఉన్నా ఆ గుడిలో అలల శబ్ధం వినిపించదు..సైన్స్ కి అందని అద్భుతం
Puri Jagannath: మనం ఎప్పుడైనా సముద్రం ఒడ్డుకు వెళ్తే.. చాలా దూరం నుంచే అలల సౌండ్ పెద్దగా వినిపిస్తుంది కదా. కానీ, ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్తే మాత్రం..బయట వినిపించే అలల శబ్ధం..గుడిలో అడుగుపెట్టగానే ఆగిపోతుంది. ఎందుకో తెలుసా?

ఒక్క అడుగుతో మాయమయ్యే సౌండ్!
పూరీ జగన్నాథ ఆలయానికి ఉన్న మెయిన్ గేట్ను ‘సింహద్వారం’ అంటారు. మీరు ఈ ద్వారం బయట నిలబడితే సముద్రపు అలల సౌండ్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. కానీ, ఆ నల్లరాతి గడప దాటి లోపలికి ఒక్క అడుగు పెట్టగానే... అంతే. ఆ సౌండ్ అస్సలు వినిపించదు. అక్కడ ఏదో ఒక సైలెన్స్ జోన్ లోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. మళ్లీ మీరు వెనక్కి తిరిగి అదే గడప బయట అడుగుపెడితే, అప్పటికప్పుడే రేడియో ఆన్ చేసినట్లు సముద్రపు చప్పుడు మళ్లీ మామూలుగా వినిపిస్తుంది.
సైంటిస్టులు ఏం చెప్తున్నారు?
జనరల్ గా శబ్దం గాలి ద్వారా ప్రయాణిస్తుంది. అంత పెద్ద సముద్రపు శబ్ధం, ఎలాంటి అడ్డు లేకుండా కేవలం ఒక్క అడుగు దూరంలో ఎలా ఆగిపోతుందో ఎవరికీ అర్థం కాలేదు. దీనిపై దేశ విదేశాల శాస్త్రవేత్తలు ఎన్నో రీసెర్చ్లు చేశారు. గుడి గోపురాల డిజైన్ వల్ల లేదా చుట్టూ ఉన్న ఎత్తైన రాతి గోడల వల్ల సౌండ్ లోపలికి రావడం లేదేమో అని టెస్ట్ చేశారు. కానీ, గాలి ఎటు వీచినా.. వాతావరణం ఎలా ఉన్నా.. ఒక్క అడుగు తేడాతో సౌండ్ పూర్తిగా నిలిచిపోవడానికి ఆధారాలు దొరకలేదు. దాంతో సైన్స్ కూడా ఇక్కడ చేతులెత్తేసింది.
ఆంజనేయ స్వామి మహిమ
సైన్స్ సమాధానం చెప్పలేని ఈ ప్రశ్నక మన పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి జగన్నాథ స్వామి లక్ష్మీదేవితో కలిసి ఆలయంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారట. అయితే బయట ఉన్న సముద్రం హోరు వల్ల స్వామివారి నిద్రకు భంగం కలిగింది. దాంతో లక్ష్మీదేవి బాధపడింది. భార్య ఇబ్బందిని చూసిన జగన్నాథుడు.. హనుమంతుడిని పిలిచి, ఆ సముద్రపు సౌండ్ గుడి లోపలికి రాకుండా చూడమని చెప్పారు. స్వామి మాట ప్రకారం ఆంజనేయ స్వామి తన శక్తులతో ఆ శబ్ద తరంగాలను సింహద్వారం దగ్గరే ఆపేశారని పురాణాలు చెబుతున్నాయి.
సంకెళ్లతో ఉన్న హనుమంతుడు!
ఈ కథ వల్లే పూరీ గుడిలో హనుమంతుడిని 'బేడి హనుమాన్' (సంకెళ్లతో ఉన్న ఆంజనేయుడు) అని పిలుస్తారు. ఈ ఆలయానికి నాలుగు వైపులా హనుమంతుడు కాపలా ఉంటూ, సముద్రపు అలల శబ్దాన్ని లోపలికి రాకుండా అడ్డుకుంటున్నాడని భక్తుల నమ్మకం. Puri Jagannath:సముద్రం పక్కనే ఉన్నా ఆ గుడిలో అలల శబ్ధం వినిపించదు..సైన్స్ కి అందని అద్భుతం

