MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ప్రాణ ప్రతిష్ఠకు ముందు రాములోరి విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు కడతారో తెలుసా?

ప్రాణ ప్రతిష్ఠకు ముందు రాములోరి విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు కడతారో తెలుసా?

ప్రతిష్ఠకు ముందు అయోధ్య రాముడి విగ్రహం కళ్లకు గంతలు కట్టి ఉన్న ఫోటోలను మీరు చూసే ఉంటారు. అసలు భగవంతుడికి విగ్రహం కళ్లకు ఎందుకు గంతలు కడతారు? శిల్పం భగవంతుడిలా ఎలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Shivaleela Rajamoni
Published : Jan 22 2024, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ram mandir ayodhya

ram mandir ayodhya

ఎంతో పవిత్రమైణ అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తి అయ్యింది. ఈ పుణ్య కార్యక్రమాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది రామ భక్తులు అయోధ్యకు తరలివెళ్లారు. ఈ రోజు ఆలయంలో రామ్ లల్లాను ప్రతిష్టించారు. మీకు తెలుసా? ప్రతిష్ఠ కు వారం రోజుల ముందు నుంచే పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ జనవరి 17నే శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేడు ప్రతిష్ఠించారు. అయితే ప్రతిష్టకు ముందు రాముడి విగ్రహం కళ్లకు గంతలు కట్టారు. ప్రతిష్ట పూర్తైన తర్వాతనే కళ్లకున్న గంతలను తొలగించారు. అసలు ప్రతిష్ఠకు ముందు విగ్రహానికి కళ్లకు గంతలు ఎందుకు కడతారు? దానివెనకున్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

25

మతపరమైన ప్రాముఖ్యత

పండితుల ప్రకారం.. ప్రతిష్ఠ తర్వాత ముందుగా భగవంతుని పాదాలనే మనం చూడాలి. ఈ సమయంలో మనం దేవుడిని స్మరించుకోవాలి. అలాగే మంత్రాలను పఠించాలి. ఆ తర్వాతనే స్వామివారి ప్రతిమను చూడాలని పండితులు చెబుతున్నారు.
 

35

అయితే విగ్రహ దర్శన సమయంలో భక్తులు నేరుగా స్వామివారి కళ్లలోకి చూస్తూ తమ భావాలను వ్యక్తపరుస్తారు. భక్తుని మనోభావాలను బట్టి భగవంతుడు కూడా లొంగిపోతాడట. భక్తుని మనోభావాలు తెలిశాక భగవంతుడు వారితో వెళ్తాడని శాస్త్రాల్లో పేర్కొన్నారు. అందుకే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముందు కళ్లకు గంతలు కట్టారట. ఈ రోజు ప్రతిష్ట పూర్తి అయ్యింది కాబట్టి.. రాములోరి విగ్రహం కళ్లకు ఉన్న గంతలను తొలగించారు. 

45

పగిలిన అద్దం రహస్యం

విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో శక్తి కిరణాలు విగ్రహంలోకి ప్రవేశిస్తాయని శాస్త్రాల్లో ఉంది. అందుకే కళ్లకు ఉన్న గంతలు తొలగించగానే ఈ ప్రకాశవంతమైన శక్తి బయటకు వస్తుందట. దీనికి అపారమైన శక్తి ఉంటుందని శాస్త్రాల్లో ఉంది. ధార్మిక గ్రంధాల ప్రకారం.. ప్రతిష్ఠ తర్వాత దేవుళ్లు లేదా దేవతల కళ్లు తెరిచినప్పుడు ప్రకాశవంతమైన కాంతి బయటకు వస్తుంది.
 

55
Ram Mandir, Ram Lalla idol

Ram Mandir, Ram Lalla idol

ఈ సమయంలో స్వామివారికి అద్దం చూపిస్తారు. ఎందుకంటే విగ్రహం నుంచి వెలువడే ప్రకాశవంతమైన శక్తి అద్దాన్ని తాకుతుంది. ఈ అపారమైన శక్తే అద్దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ప్రకాశవంతమైన శక్తిని తట్టుకోవడం కష్టం. అందుకే కళ్లకున్న గంతలు తీసేసిన వెంటనే భగవంతునికి దర్పణాన్ని చూపిస్తారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
Recommended image2
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!
Recommended image3
Chanakya Niti: జీవితంలో ఈ ముగ్గురు ఉంటే... మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved