కేవలం రూ.5 వేలలో కేదార్నాథ్ యాత్ర.. పూర్తి ప్లాన్ ఇదే!
spiritual Jul 25 2026
Author: Arun Kumar P Image Credits:x
Telugu
తెరిచివున్న కేదార్నాథ్ ఆలయం
ప్రస్తుతం కేదార్నాథ్ ఆలయం తెరిచివుంది… కాబట్టి ఆ కేధార నాథున్ని దర్శించుకునేందుకు ఇదే మంచి సమయం. మరి తక్కువ ఖర్చులో కేదార్ నాథ్ యాత్రను ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Image credits: x
Telugu
తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో కేదార్నాథ్ యాత్ర
హైదరాబాద్ నుండి దేశ రాజధాని ఢిల్లీకి… అక్కడి నుంచి కేదార్నాథ్ చేరుకోవాలి. డిల్లీ నుంచి కారు, బస్సు, రైలు, విమానం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చేరుకోవచ్చు.
Image credits: social media
Telugu
రైలు ప్రయాణం బెస్ట్ ఆప్షన్
ఎక్కడికైనా వెళ్లాలంటే రైలు ప్రయాణం ఉత్తమమైనదిగా చాలామంది భావిస్తారు. అందుకే ఢిల్లీ నుంచి కేదార్నాథ్ వెళ్లడానికి రైలు మార్గాన్ని ఎంచుకోండి.. చాలా రైళ్లు అందుబాటులో ఉంటాయి.
Image credits: x
Telugu
అత్యంత చౌకైన కేదార్నాథ్ యాత్ర
సౌకర్యవంతంగా, చౌకగా కేదార్నాథ్ యాత్ర చేయాలనుకుంటే ముందుగా ఢిల్లీ నుంచి హరిద్వార్ లేదా రిషికేశ్ చేరుకోండి. ఇక్కడికి స్లీపర్ క్లాస్ రైలు టికెట్ ధర రూ.200 నుంచి రూ.250 వరకు ఉంటుంది.
Image credits: x
Telugu
హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్కు బస్సులో..
హరిద్వార్ నుంచి ప్రభుత్వ బస్సులో సోన్ప్రయాగ్ వెళ్లాలి. దీనికి రూ.500 నుంచి రూ.600 ఛార్జ్ చేస్తారు. ఇక్కడి నుండి గౌరీకుండ్కు రూ.50 ఛార్జ్ తో షేరింగ్ జీపులో వెళ్లొచ్చు.
Image credits: social media
Telugu
రాత్రి బసకు రూ.600 మాత్రమే
గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ కు 18 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. గౌరీకుండ్ లేదా కేదార్నాథ్లో టెంట్లు, GMVN టెంట్లు లేదా ధర్మశాలల్లో రాత్రి బస చేయొచ్చు. దీనికి రూ.600 ఖర్చవుతుంది.
Image credits: social media
Telugu
రూ.50కే కడుపు నిండా భోజనం
గౌరీకుండ్ లేదా కేదార్నాథ్ ధామ్లో నిర్వహించే భండారాల్లో ప్రసాదం తీసుకోవచ్చు. లేదా ఇక్కడ చాలా దాబాలు ఉన్నాయి. ఇవి రూ.50 నుంచి రూ.100కే కడుపు నిండా భోజనం పెడతాయి.