MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • అయోధ్య నుంచి ఇంటికి వచ్చిన అక్షింతలను ఏం చేస్తున్నారు?

అయోధ్య నుంచి ఇంటికి వచ్చిన అక్షింతలను ఏం చేస్తున్నారు?

ఈ పాటికే దేశంలోని ప్రతి ఇంటికీ అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు చేరే ఉంటాయి. ఈ అక్షింతలను మనం ఎంతో పవిత్రంగా భావించాలి. ఇవి సంపద, వైభవం, లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాదు ఈ అక్షింతలు ఆ రామయ్య అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాయని నమ్ముతారు. అందుకే అయోధ్య రామ మందిరం నుంచి మన ఇంటికి వచ్చిన అక్షింతలతో ఏం చేయాలో తెలుసుకుందాం..  

1 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Jan 22 2024, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మరికొద్ది సేపట్లో ఈ అద్బుతమైన ఘట్టం జరుగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంతో మతపరమైన ప్రాముఖ్యతను కలిగిన ఈ కార్యక్రమంలో ఎన్నో ముఖ్యమైన భారతీయ సంప్రదాయాలను పాటిస్తున్నారు. కాగా ప్రాణ ప్రతిష్టకు సంప్రదాయబద్ధంగా పసుపు అక్షింతలతో దేశవ్యాప్తంగా ఆహ్వానాలు పంపారు. దేశం అంతటా ప్రతి గడపకు అయోధ్య నుంచి అక్షింతలు చేరే ఉంటాయి. ఈ అక్షింతలను చారిత్రాత్మకంగా పండుగలు లేదా ఏదైనా శుభకార్యాలకు ఆహ్వానించడానికి ఉపయోగిస్తారు.
 

23

పసుపు అక్షతల మతపరమైన ప్రాముఖ్యత

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బియ్యాన్ని శుక్ర గ్రహానికి చిహ్నంగా భావిస్తారు. ఇది సంపద, కీర్తి, లక్ష్మి, భౌతిక సౌకర్యాలతో ముడిపడి ఉంటుంది. ఈ అక్షింతలను ఎర్రని పట్టు వస్త్రంలో కట్టి భద్రంగా పెడితే.. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే మార్గం తెరుచుకుంటుందని నమ్ముతారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు జీవితాంతం మనకు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు ఈ అక్షింతలు మన ఇంట్లో ఉన్నంత కాలం ఇంట్లోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. జీవితం ఆనందంగా సాగుతుంది.

33
Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir

అక్షింతలను ఎక్కడ ఉపయోగించాలి? 

ఈ పసుపు బియ్యాన్ని మీరు ఎలాంటి శుభకార్యాల్లో అయినా ఉపయోగించొచ్చు.

అలాగే వీటితో నైవేద్యం తయారుచేసి ప్రసాదంగా ఇంటిళ్లి పాది తినొచ్చు. 

ఈ అక్షింతలను మీరు తిలకంగా కూడా వాడుకోవచ్చు. 

అక్షతలను సురక్షితంగా ఉంచితే మీ ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటాయి.

అక్షింతలను పర్సులో భద్రపరుచుకోవడం వల్ల మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి కొదవా ఉండదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
నరేంద్ర మోదీ
Latest Videos
Recommended Stories
Recommended image1
Ugadi: కొత్త సంవత్సరం రోజున శుభ ఫలితాలు ఇచ్చే 4 మంత్రాలు
Recommended image2
Ugadi Festival 2026: ఉగాది రోజున ఈ ఒక్క పని చేయకపోతే… ఏడాది మొత్తం ప్రభావం పడుతుందా?
Recommended image3
Dosa Prasadam: ఈ గుడిలో ప్రసాదంగా దోశలు పెడతారు.. ఆ దోశ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved