- Home
- Life
- Relationship
- Illicit Relationship : ఐదుగురు పిల్లలకు నిద్రమాత్రలిచ్చి.. 10 ఏళ్లు చిన్నోడితో తల్లి జంప్..!
Illicit Relationship : ఐదుగురు పిల్లలకు నిద్రమాత్రలిచ్చి.. 10 ఏళ్లు చిన్నోడితో తల్లి జంప్..!
సభ్యసమాజం తలదించుకునే ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది. ఐదుగురు పిల్లల తల్లి తనకంటే చిన్నవాడిని ప్రేమించింది… భర్త కళ్లుగప్పి, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడి ప్రియుడితో లేచిపోయింది.

ఈమె అసలు తల్లేనా..!
ఈ కలికాలంలో మానవ సంబంధాలకు విలువన్నదే లేదు… ఇందుకు నిదర్శనమే ఈ ఘటన. ఓ మహిళ అమ్మతనాన్ని మరిచి అమానుషంగా ప్రవర్తించింది. కట్టుకున్నవాడిని వదిలించుకుని ప్రియుడితో లేచిపోయేందుకు కన్న బిడ్డల ప్రాణాలతో చెలగాటం ఆడింది. తన ఐదుగురు పిల్లల తిండిలో నిద్రమాత్రలు కలిపి తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో పారిపోయింది. భర్త ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే ఆ జంటను పట్టుకున్నారు.
అసలేం జరిగింది..?
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో జరిగింది. ఈ మహిళ ఉదంతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆమె పోలీసులకు ఇస్తున్న వాంగ్మూలం వీడియో వైరల్ అవుతోంది. 33 ఏళ్ల మిథిలేశ అనే ఐదుగురు పిల్లల తల్లి, 22 ఏళ్ల సురేంద్ర అలియాస్ ఖన్నాతో ప్రేమలో పడింది. భర్త, పిల్లలను కాాదని అతడితో జీవించేందుకు సిద్దమయ్యింది.
పిల్లల ప్రాణాలతో చెలగాటం..
సురేంద్రతో వెళ్లే ముందు మిథిలేశ తన ఐదుగురు పిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చింది. పిల్లలు పూర్తిగా స్పృహ కోల్పోగానే, ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, ఇతర విలువైన వస్తువులు తీసుకుని పారిపోయింది. పిల్లలు ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండగానే తలుపుకు తాళం వేసి వెళ్లిపోయింది.
మహిళను పట్టుకున్న పోలీసులు...
మిథిలేశ భర్త రూప్ కిశోర్ ఢిల్లీలో టైలర్గా పనిచేస్తున్నాడు. విషయం తెలియగానే గ్రామానికి వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని 24 గంటల్లోనే మిథిలేశ, ఆమె ప్రియుడు సురేంద్రను పట్టుకున్నారు. నిద్రమాత్రల కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన పిల్లలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
నెటిజన్స్ సీరియస్...
రాంపూర్ పోలీస్ స్టేషన్లో కూర్చుని మహిళ వాంగ్మూలం ఇస్తున్న వీడియో వేగంగా వైరల్ అయింది. 'ఐదుగురు పిల్లలున్నా మరో వ్యక్తితో ప్రేమ ఏంటి? ఒకవేళ పిల్లలకు ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? దేవుడు గొప్పవాడు, పిల్లలకు ఏమీ కాలేదు' అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భర్త తోడుగా లేకపోవడం వల్లే ఆమె ఇలా చేసి ఉండొచ్చని, లేదా వారి వైవాహిక జీవితం సరిగా లేకపోవడం కూడా కారణం కావొచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

