- Home
- National
- ఇలాంటి వాళ్లను చెప్పుతో కొట్టాలి.. బస్సులో మహిళను అసభ్యకరంగా తాకుతూ, వైరల్ వీడియో
ఇలాంటి వాళ్లను చెప్పుతో కొట్టాలి.. బస్సులో మహిళను అసభ్యకరంగా తాకుతూ, వైరల్ వీడియో
Viral Video: సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మహిళల భద్రతకు భరోసా లేదనిపించకమానదు. కొందరు చేసే నీచమైన పనులు సభ్యసమాజం తలదించుకునే ఉంటున్నాయి. తాజాగా కేరళలో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్కి గురి చేసింది.

బస్సులో లైంగింక వేధింపులు
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఓ మహిళ బస్సులో లైంగిక వేధింపులకు గురైంది. అయితే భయపడకుండా ఆ మహిళ స్వయంగా వీడియో రికార్డ్ చేసి దోషిని బహిర్గతం చేసింది. ఈ ఘటనను బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు చూస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరూ స్పందించలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
బస్సులో జరిగిన ఘటన
తిరువనంతపురంలోని ఒక పబ్లిక్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళను పక్కన కూర్చున్న వ్యక్తి అసభ్యంగా తాకాడు. ఆ వ్యక్తి ప్రవర్తన చూసి మహిళ వెంటనే తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసింది. తర్వాత అందరి ముందే అతడిని ప్రశ్నించింది. కానీ ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు.
సోషల్ మీడియాలో ఆగ్రహం
సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది మహిళ ధైర్యాన్ని ప్రశంసించగా, పక్కన ఉన్న ప్రజలు స్పందించకపోవడాన్ని విమర్శించారు. “అంత మంది ఉన్న బస్సులో ఇలా వేధిస్తున్నాడంటే, అతను ఇప్పటికే అలవాటు పడ్డ వాడే” అంటూ చాలామంది మండిపడ్డారు. ఇక “అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, బస్సులో ఉన్నవాళ్లంతా నిశ్శబ్దంగా చూడటం సిగ్గుచేటు” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
న్యాయం కోసం మహిళలు ఎదుర్కొనే కష్టాలు
ఈ ఘటన మరోసారి మహిళలు న్యాయం కోసం ఎదుర్కొనే కష్టాలను గుర్తు చేసింది. చాలామంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తూ, “భారతదేశంలో లైంగిక వేధింపుల కేసులు ఫైల్ చేయడం చాలా కష్టం. పోలీసులు, సమాజం రెండూ బాధితురాలినే ప్రశ్నిస్తాయి” అన్నారు. మరికొందరు “మహిళ ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేస్తే ఎవరూ నమ్మరు. అందుకే ఈ మహిళ వీడియో తీసింది” అని అభిప్రాయపడుతున్నారు.
అరెస్ట్ చేయాలంటూ..
వీడియోలో స్పష్టంగా సాక్ష్యం ఉన్నప్పటికీ, మహిళ పోలీస్ ఫిర్యాదు చేసిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఆ వ్యక్తిని గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. “ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇలాంటి ఘటనలు ఆగవు” అని వ్యాఖ్యానించారు. ఇక మరికొందరు మాత్రం ఇలాంటి వారిని నడి రోడ్డుపై చెప్పుతో కొట్టాలని కామెంట్స్ చేస్తున్నారు.
సమాజానికి సందేశం
ఈ సంఘటన కేవలం ఒక బస్సులో జరిగిన లైంగిక వేధింపుల కేసు మాత్రమే కాదు, సమాజం మౌనం ఎలా నేరస్తులకు బలం ఇస్తుందో కూడా చెబుతోంది. బాధితురాలు సాక్ష్యాన్ని సేకరించి తన ధైర్యాన్ని చూపించినా, ఆ బస్సులో ఉన్న వారంతా నిశ్శబ్దంగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఇటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ స్పందించడం, న్యాయం సాధించే దిశగా సహాయం చేయడం సమాజపు బాధ్యతగా మారాలి.