MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • గాంధీని కాల్చినపుడు ఆయన్ను ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఆ రోజు అసలేం జరిగింది..

గాంధీని కాల్చినపుడు ఆయన్ను ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఆ రోజు అసలేం జరిగింది..

అహింసా, శాంతి అనే ఆయుధాలతో దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించిన మహోన్నత వ్యక్తి గాంధీ. "ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే భావి తరాల వారు నమ్మలేకపోవచ్చు" అని ప్రముఖ శాస్త్రవేత్త  ఐన్‌స్టీన్ అన్నారంటేనే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన హత్యకు గురైన రోజు జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకుందాం.. 

2 Min read
Narender Vaitla
Published : Jan 30 2025, 11:29 AM IST| Updated : Jan 30 2025, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అహింసా, శాంతిని ఆయుధాలుగా మార్చుకొని, స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించారు జాతిపిత మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ. "ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే భావి తరాల వారు నమ్మలేకపోవచ్చు" మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. దీనిబట్టే గాంధీజీ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇన్నేళ్లయినా గాంధీని పూజిస్తునే ఉన్నాం. ఆయన చూపిన మార్గంలో నడించేందుకు ఆసక్తి చూపిస్తున్నాం. 
 

24

మహాత్మా గాంధీని 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే కాల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచమంతటా విషాదాన్ని రేకెత్తించింది. 1947 ఆగస్టులో భారతదేశం, పాకిస్తాన్‌లుగా విడిపోయిన తర్వాత హిందువులు, ముస్లింలు, సిక్కుల మధ్య చెలరేగిన హింస గాంధీకి తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ కారణంగా గాంధీ 1948 జనవరి 13న గాంధీ తన జీవితంలోని చివరి నిరాహార దీక్షను ప్రారంభించారు. దేశంలోని అన్ని మతాల ప్రజలు సఖ్యతతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. 

ఈ క్రమంలోనే నిరాహార దీక్షలో ఉన్న గాంధీపై జనవరి 20వ తేదీన ఆయనను హతమార్చాలని కొందరు బాంబు విసిరారు. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. అయితే దీనిపై గాంధీజీ ఏమాత్రం భయపడలేదు. మరణించాల్సి వస్తే, నవ్వుతూ మరణిస్తానని తెలిపారు. ఈ క్రమంగానే 1948 జనవరి 30వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో మహాత్మా గాంధీ బిర్లా హౌజ్‌లోని తోటలో ప్రార్థన కోసం వెళ్తున్నారు. 
 

34

ఆస్పత్రి తీసుకెళ్లే ప్రయత్నం జరగలేదా.? 

అదే సమయంలో నాథూరామ్‌ గాడ్సే జన సందోహం మధ్య నుంచి వచ్చి గాంధీకి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. అనంతరం వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడు రౌండ్లు కాల్చాడు. దీంతో బుల్లెట్లు గాంధీ ఛాతీతోపాటు పొట్ట నుంచి దూసుకెళ్లాయి. తుపాకీ దాడికి గాంధీ ఒక్కసారిగా భూమిపై కూలిపోతూ.. 'హే రామ్‌' అన్నారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే ఈ ఊహించని సంఘటనతో అంత ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లారు. దీంతో కనీసం వైద్యుడిని కూడా ఎవరూ పిలవలేదు. అలాగే అంతా అయోమయంలో ఉండగా చనిపోతున్న వ్యక్తిని ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నం చేయకపోవడంతో గాంధీజీ తుది శ్వాస విడిచారు. 

అదుపులోకి తీసుకున్న పోలీసులు

గాంధీపై దాడి చేసిన వెంటనే నాథూరామ్‌ గాడ్సే తనను తాను కాల్చుకోవడానికి ప్రయత్నించాడని, అయితే పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెబుతారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా గాడ్సేను కొట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు గాడ్సేను అరెస్ట్‌ చేశారు. గాడ్సేపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు 1949 నవంబర్‌లో ఉయనను గాడ్సేను ఉరితీస్తారు. 
 

44

గాంధీ అంతిమ యాత్ర

గాంధీ తుదిశ్వాస విడిచిన తర్వాత గాంధీ భౌతికకాయాన్ని బిర్లా హౌస్‌లో సంప్రదాయ ధోతితో కప్పారు. భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రేడియో ప్రసంగంలో, "జాతిపిత ఇక లేరు. మేము వెలుతురును కోల్పోయాం" అని అన్నారు. గాంధీ భౌతికకాయాన్ని భారత జాతీయ పతాకంతో కప్పి, సైనిక వాహనంలో యమునా నది ఒడ్డుకు తీసుకెళ్లారు. లక్షలాది మంది ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ భౌతికకాయాన్ని సంప్రదాయ విధానంలో దహనం చేశారు.

దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు.. 

గాంధీ హత్య జరిగిన విషయం తెలిసిన వెంటనే దేశంలో వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగింది. ముఖ్యంగా ముంబయిలో అల్లర్లు, హింసాత్మక దాడులు జరిగాయి. ఓ వర్గాన్ని టార్గెట్‌ చేసుకొని కొంతమంది దాడులకు దిగారు. గాంధీజీ మృతితో భారతదేశం ఒక మహానాయకుడిని కోల్పోయింది. ఆయన లేకపోయినా.. ఆయన పాటించిన అహింస, శాంతి, సహన సిద్దాంతాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved