MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Jobs: డిప్లొమా అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో 1340 ఉద్యోగాలు...ఇప్పుడే దరఖాస్తు చేసేయండి!

Jobs: డిప్లొమా అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో 1340 ఉద్యోగాలు...ఇప్పుడే దరఖాస్తు చేసేయండి!

SSC జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో 1340 పోస్టులకు జూలై 21 లోపు దరఖాస్తు చేయాలి.

2 Min read
Author : Bhavana Thota
Published : Jul 04 2025, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ
Image Credit : Gemini

జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను సిబ్బంది ఎంపిక కమిషన్ (SSC) తాజాగా విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిలవనుంది. మొత్తం 1340 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

27
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్
Image Credit : Asianet News

సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్

ఈ జాబితాలో ప్రధానంగా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ వాటర్ కమిషన్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లాంటి కేంద్ర ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఈ సంస్థలలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

జూలై 21, 2025 చివరి తేదీగా నిర్ణయించబడింది. ఈ గడువులోపే అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ అయిన https://ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Related Articles

Related image1
government jobs notification : కేవలం టెన్త్ అర్హతతో... పరీక్ష లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Related image2
Bank Jobs: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5208 ఉద్యోగాలు..కేవలం డిగ్రీ ఉంటే చాలు!
37
 నాలుగు విభాగాల్లో
Image Credit : social media

నాలుగు విభాగాల్లో

ఈ పోస్టులు నాలుగు విభాగాల్లో ఉంటాయి: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్,క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్. ఈ విభాగాల్లో సంబంధిత అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.పరీక్ష విధానం రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబడుతుంది. ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ పై ఒక్కోటి 50 ప్రశ్నలు, అలాగే సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టుపై 100 ప్రశ్నలు వస్తాయి. మొత్తం పరీక్ష వ్యవధి రెండు గంటలు ఉంటుంది.

47
కంప్యూటర్ ఆధారిత పరీక్ష
Image Credit : Getty

కంప్యూటర్ ఆధారిత పరీక్ష

రెండవ దశ పరీక్ష కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇది పూర్తిగా సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలతో ఉండి, మొత్తం 100 ప్రశ్నలకు 300 మార్కులు కేటాయిస్తారు. పరీక్షకు కూడా రెండు గంటల సమయం ఉంటుంది.అభ్యర్థుల ఎంపిక ఈ రెండు పరీక్షలలో ప్రదర్శన ఆధారంగా జరుగుతుంది. ఎవరికి అత్యుత్తమ మార్కులు వస్తాయో, వారికి పదవులకే అవకాశం ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండాలి. వయస్సు పరిమితి సాధారణంగా 30 ఏళ్ల వరకు ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

57
వేతన విషయం
Image Credit : Getty

వేతన విషయం

వేతన విషయంలో చూస్తే, ఈ జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నెల జీతం రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ 7వ వేతన కమిషన్ ప్రామాణికాలకు అనుగుణంగా ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ. 100గా నిర్ణయించబడింది. అయితే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు, మహిళలకు ఈ రుసుము మినహాయింపు ఉంటుంది.దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అభ్యర్థులు ముందుగా SSC వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, ఖాతా నమోదు చేసుకుని, అటుపై అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, దరఖాస్తును సమర్పించాలి.

67
అధికారిక నోటిఫికేషన్
Image Credit : Getty

అధికారిక నోటిఫికేషన్

ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు SSC అధికారిక నోటిఫికేషన్ పిడిఎఫ్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు https://ssc.gov.in/api/attachment/uploads/masterData/NoticeBoards/Notice_of_adv_je_2025.pdf లింక్ ద్వారా దానిని చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఇంజనీర్ ఖాళీలను నాణ్యమైన పరీక్షల ద్వారా అర్హులను ఎంపిక చేసి భర్తీ చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది. గతంలో SSC నిర్వహించిన JE పరీక్షల ప్రక్రియల ప్రకారం, ఈసారి కూడా కంప్యూటర్ బేస్డ్ పరీక్షల తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందని భావించవచ్చు.

77
ఇంజనీరింగ్ విద్యార్థులకు
Image Credit : Getty

ఇంజనీరింగ్ విద్యార్థులకు

ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది మంచి అవకాశం. ఉద్యోగ భద్రతతో పాటు కేంద్ర ప్రభుత్వ అన్ని ప్రయోజనాలు కూడా ఈ పోస్టులకు వర్తిస్తాయి. అందువల్ల, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. జూలై 21లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయడం చాలా అవసరం.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘం లేఖలో ఏముంది?
Recommended image2
Now Playing
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు.. కానీ Raghav Chadha ఆప్ ఎందుకిలా చేసింది? | Asianet News Telugu
Recommended image3
Gratuity : ఉద్యోగులకు పండగే.. ఇక ఐదేళ్లు అక్కర్లేదు, ఏడాదికే గ్రాట్యుటీ.. కొత్త రూల్స్ ఇవే
Related Stories
Recommended image1
government jobs notification : కేవలం టెన్త్ అర్హతతో... పరీక్ష లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Recommended image2
Bank Jobs: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5208 ఉద్యోగాలు..కేవలం డిగ్రీ ఉంటే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved