MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • National
  • Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా

Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా

Sabarimala Gold Heist : శబరిమల బంగారం కుంభకోణం కేసులో ఈడీ రూ.1.3 కోట్ల ఆస్తులు సీజ్ చేసింది. ఇది వ్యవస్థీకృత దోపిడీ అని వ్యాఖ్యానిస్తూ కేరళ హైకోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 21 2026, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శబరిమల గోల్డ్ కుంభకోణం: ఈడీ సంచలన రిపోర్టు, రూ.1.3 కోట్ల ఆస్తులు సీజ్.. హైకోర్టు సీరియస్
Image Credit : Asianet News

శబరిమల గోల్డ్ కుంభకోణం: ఈడీ సంచలన రిపోర్టు, రూ.1.3 కోట్ల ఆస్తులు సీజ్.. హైకోర్టు సీరియస్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల బంగారం కుంభకోణం (Sabarimala Gold Theft) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక పురోగతి సాధించిన ఈడీ అధికారులు, నిందితులకు చెందిన భారీ ఆస్తులను సీజ్ చేసింది. మరోవైపు, ఈ కేసు విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు నిందితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది దైవ సన్నిధిలో జరిగిన వ్యవస్థీకృత దోపిడీ అని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆపరేషన్ గోల్డెన్ షాడో : ఈడీ సోదాల్లో షాకింగ్ నిజాలు
Image Credit : Asianet News

ఆపరేషన్ గోల్డెన్ షాడో : ఈడీ సోదాల్లో షాకింగ్ నిజాలు

శబరిమల అయ్యప్ప స్వామికి చెందిన బంగారం చోరీ కేసులో ఈడీ అధికారులు ఆపరేషన్ గోల్డెన్ షాడో పేరుతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితులకు చెందిన సుమారు రూ. 1.3 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈ ఆస్తులు కేసులోని ప్రధాన నిందితులకు సంబంధించినవిగా అధికారులు గుర్తించారు. మంగళవారం కేరళ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ముఖ్యంగా, స్మార్ట్ క్రియేషన్ అనే సంస్థ నుంచి 100 గ్రాముల బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి గోల్డ్ బార్స్ రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో బయటపడిన మరో సంచలన విషయం ఏమిటంటే, బంగారాన్ని రాగిగా మార్చినట్లు చూపే పత్రాలను కూడా ఈడీ గుర్తించింది. ఈ పత్రాలు దర్యాప్తులో అత్యంత కీలకం కానున్నాయి.

36
ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డులో అనుమానాస్పద లావాదేవీలు
Image Credit : Asianet News

ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డులో అనుమానాస్పద లావాదేవీలు

ఈడీ అధికారులు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (Travancore Devaswom Board) ప్రధాన కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడి నుంచి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా 2019 నుండి 2024 మధ్య కాలంలో జారీ చేసిన ఉత్తర్వులను ఈడీ కస్టడీలోకి తీసుకుంది.

దేవస్థానం బోర్డులోని కొందరు అధికారుల ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. వీటికి సంబంధించిన రికార్డులను అధికారులు సేకరించారు. దైవ కార్యాల కోసం వినియోగించాల్సిన నిధులు, బంగారం పక్కదారి పట్టాయన్న ఆరోపణలకు ఈ పత్రాలు బలం చేకూరుస్తున్నాయి.

46
ఇది మామూలు దొంగతనం కాదు.. వ్యవస్థీకృత దోపిడీ: హైకోర్టు
Image Credit : Asianet News

ఇది మామూలు దొంగతనం కాదు.. వ్యవస్థీకృత దోపిడీ: హైకోర్టు

ఈ కేసులో అరెస్టయిన నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శబరిమలలో జరిగింది సాధారణ దొంగతనం కాదని, అది ఒక వ్యవస్థీకృత దోపిడీ అని జస్టిస్ ఎ. బదరుద్దీన్ ధర్మాసనం పేర్కొంది. అయ్యప్ప స్వామి ఆస్తులను లూటీ చేయడానికి నిందితులు ఒక ముఠాగా ఏర్పడి పనిచేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు, సీపీఎం నేత ఎ. పద్మకుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురారి బాబు, గోవర్ధన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. వీరికి సమాజంలో, రాజకీయంగా ఉన్న పలుకుబడిని దృష్టిలో ఉంచుకుని, బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా పద్మకుమార్ ఒక రాజకీయ పార్టీలో సభ్యుడిగా కొనసాగుతున్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.

56
మాయమైన 4 కిలోల బంగారం ఎక్కడ?
Image Credit : Asianet News

మాయమైన 4 కిలోల బంగారం ఎక్కడ?

శబరిమల సన్నిధానంలో బంగారు రేకులను పునరుద్ధరించే క్రమంలో దాదాపు 4147 గ్రాముల బంగారం మాయమైందని దర్యాప్తు బృందం కోర్టుకు తెలిపింది. ఇందులో కేవలం 474 గ్రాముల బంగారం మాత్రమే ఇప్పటివరకు దొరికింది. మిగిలిన బంగారం ఏమైందో కచ్చితంగా తేల్చాలని హైకోర్టు ఆదేశించింది.

పోగొట్టుకున్న బంగారాన్ని పూర్తిగా రికవరీ చేయాలని, ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు న్యాయస్థానం సూచించింది. అలాగే, అరెస్టయిన శంకర్ దాస్ అనే మరో నిందితుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నందున, అతనికి ఎలాంటి చికిత్స అవసరమో మెడికల్ బోర్డు ద్వారా పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.

66
పంచాగ్ని మధ్య తపస్సు చేసినా పాపం పోదు !
Image Credit : Asianet News

పంచాగ్ని మధ్య తపస్సు చేసినా పాపం పోదు !

తీర్పు వెలువరించే సమయంలో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేశాయి. మలయాళ చిత్రం అద్వైతం లోని "పంచాగ్ని మధ్యే తపస్సు చేసినా.. ఈ పాప కర్మకు ప్రాయశ్చిత్తం అవుతుందా.." అనే పాట పంక్తులను న్యాయమూర్తి ప్రస్తావించారు.

శబరిమల వంటి పవిత్ర క్షేత్రంలో జరిగిన ఈ భారీ దోపిడీని చూస్తుంటే ప్రజలకు ఈ పాట గుర్తుకు వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. జాతి, మత, పదవి భేదాలు లేకుండా ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసిందని పేర్కొంది. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితులకు ఊరట లభించే అవకాశం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Recommended image2
ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి ఆస్తి ల‌క్ష‌రాల రూ. 3 వేల కోట్లు.. ఇంత‌కీ ఎందుకిలా మారాడంటే
Recommended image3
8th Pay Commission: 8వ పే కమిషన్ వస్తే పెన్షన్ 50 శాతం పెరగడం పక్కానా? జీతాలు డబుల్?
Related Stories
Recommended image1
Silver Wedding Card : వామ్మో.. పెళ్లి పత్రిక రేటు రూ. 25 లక్షలా? వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
Highway Milestones : మీరు వెళ్లేది ఏ రోడ్డో ఈ చిన్న రాయి చెప్పేస్తుంది.. ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved