MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • గుర్రపుబగ్గీలో రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

గుర్రపుబగ్గీలో రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

india republic day: భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 2025న గొప్ప వేడుకలను జ‌రుపుకుంటోంది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథంలో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jan 26 2025, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

Republic Day Parade 2025: జనవరి 26న 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని కర్తవ్య ప‌థ్ లో 'విరాసత్, వికాస్'ల సింబాలిక్ సంగమాన్ని, భారతదేశం తన సైనిక పరాక్రమాన్ని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తోంది.

భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 2025న గొప్ప వేడుకలను జ‌రుపుకుంటోంది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథంలో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. కవాతును చూసేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఉదయం 10:30 గంటలకు కవాతు ప్రారంభమైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

గుర్రపుబగ్గీలో రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము 

భార‌త రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జ‌రిగే రిప‌బ్లిక్ డే వేడుక‌ల గుర్ర‌పుబ‌గ్గీలో విచ్చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌ నుంచి బయలుదేరారు. రాష్ట్రప‌తితో పాటు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో కూడా ఉన్నారు. రాష్ట్రపతి అంగరక్షకులు గుర్రాలపై స్వారీ చేస్తూ గౌర‌వ‌వంద‌నంతో ముందుకుసాగారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఇక్కడకు వచ్చారు. రాష్ట్రపతికి ఆయన స్వాగతం పలికారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను నరేంద్ర మోడీ కౌగిలించుకుని గౌర‌వంగా స్వాగ‌తం ప‌లికారు. 

గణతంత్ర దినోత్సవం 2025 వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు?

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఇండోనేషియా రిపబ్లిక్ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో ప్రత్యేక అతిథి. సుబియాంటో పర్యటన 1950లో భారతదేశ ప్రారంభ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో అడుగుజాడల్లో భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే నాల్గవ ఇండోనేషియా అధ్యక్షుడు కానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగిస్తారు.

“మా గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా మీరు భారతదేశాన్ని సందర్శించడం మాకు ఎంతో గర్వకారణం. ఈవెంట్‌లో మొదటిసారిగా ఇండోనేషియా మార్చింగ్ స్క్వాడ్‌ను చూసేందుకు మేమంతా ఆసక్తిగా ఉన్నాము. మరోసారి, నేను మీకు, మీ ప్రతినిధి బృందానికి భారతదేశానికి స్వాగతం పలుకుతున్నాను” అని ప్రధాని మోడీ అంతుకుముందు వారికి స్వాగ‌తం ప‌లికారు. 

33

2025 సంవత్సరం రిప‌బ్లిక్ డే ప్రత్యేకత ఏమిటి?

కర్తవ్య పథ్ లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను వీక్షించేందుకు 600 మందికి పైగా పంచాయతీ నాయకులను ప్రత్యేక అతిథులుగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఈ ప్రత్యేక అతిథులు వారి సంబంధిత పంచాయతీలలో వివిధ ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌ల క్రింద లబ్దిదారుల కోసం అత్యుత్తమ సహకారం అందించినందుకు ఎంపిక చేసిన‌ట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

హర్ ఘర్ జల్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీన్), మిషన్ ఇంద్రధనుష్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఆయుష్మాన్ భారత్), ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి పోషణ్ యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన, ప్ర‌ధాన మంత్రి విశ్వ‌కర్మ, ప్ర‌ధాన మంత్రి విశ్వ‌కర్మ వందన యోజన, ది కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకంలో సేవ‌లు అందించిన వారు ఉన్నారు. అలాగే, మొత్తం 10వేల మందిని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood
Recommended image2
Now Playing
నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal
Recommended image3
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved