MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • రతన్ టాటా యంగ్ ఫ్రెండ్ శంతను కొత్త ప్రాజెక్ట్ 'బుక్కీస్' ...ఏమిటిది?

రతన్ టాటా యంగ్ ఫ్రెండ్ శంతను కొత్త ప్రాజెక్ట్ 'బుక్కీస్' ...ఏమిటిది?

రతన్ టాటా మేనేజర్ శాంతను నాయుడు 'బుక్కీస్' అనే కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Arun Kumar P
Published : Dec 06 2024, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Shantanu Naidu

Shantanu Naidu

ఇండియాలో గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన రతన్ టాటా చనిపోయి దాదాపు రెండు నెలలైంది. ఆయన లేకపోవడం ఆయన అభిమానులు, సన్నిహితులకు బాధాకరం. వాళ్ళలో ఒకరు టాటా యువ మేనేజర్ శాంతను నాయుడు. రతన్ టాటా, శాంతను నాయుడు ఇద్దరికీ జంతువులంటే ప్రేమ ఉండటం వల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. 

25
Shantanu Naidu

Shantanu Naidu

చాలా సంవత్సరాలుగా రతన్ టాటాతో కలిసి పనిచేసే అవకాశం శాంతనుకి దక్కింది. టాటా, శాంతను ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ యువకుడి జీవితంలో, కెరీర్‌లో టాటా ప్రభావం చాలా ఉంది. తాజాగా తన స్నేహితుడు టాటాను కోల్పోయిన బాధ నుండి బయటకు వచ్చిన శంతను కొత్త ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు.

శంతను నాయుడు 'బుక్కీస్' అనే ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. ఇది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో కలిసి చదువుకోడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ అని ఆయన LinkedIn పోస్ట్‌లో రాశారు. మొదట ముంబైలో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూణే, బెంగళూరులకు విస్తరించింది.

35
Shantanu Naidu

Shantanu Naidu

డిసెంబర్ 8న జైపూర్‌లో 'బుక్కీస్' ప్రాజెక్ట్ మొదలవుతుంది. తర్వాత కలకత్తా, ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్‌లకు విస్తరించాలని శంతను అనుకుంటున్నారు. "ఒక ప్రయోగంగా మొదలైన ప్రాజెక్ట్ ఇప్పుడు ఉద్యమంలా మారింది. పుస్తకాలు మళ్ళీ చదవడం మొదలుపెడదాం. ఈ నగరాల్లో వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవచ్చు" అని శంతను పేర్కొన్నాడు.

45
Shantanu Naidu

Shantanu Naidu

మరో పోస్ట్‌లో జైపూర్ ఈవెంట్ గురించి శంతను నాయుడు ప్రకటించారు. "జైపూర్ వాసులారా, పుస్తకాలు చదవడానికి ఇదే సమయం. వెంటనే రిజిస్టర్ చేసుకోండి" అని రాశారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజల్లో చదవాలనే ఆసక్తిని పెంచాలని, కలిసి చదవడం వల్ల మంచి అలవాటు ఏర్పడుతుందని ఆయన అన్నారు. "ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం చదవడాన్ని తిరిగి ప్రోత్సహించడమే. మనుషుల అనుభవాలకు చదవడం చాలా ముఖ్యం, కానీ ఇప్పుడు చదవడం తగ్గిపోతోంది. కలిసి చేసే ఏ పని అయినా ఒంటరిగా చేసేదానికంటే త్వరగా అలవాటు అవుతుంది" అని శాంతను నాయుడు అన్నారు. చాలామంది ఫోన్ల వల్ల పక్కదారి పడుతున్నారని, ఎక్కువసేపు ఏకాగ్రతతో ఉండలేకపోతున్నారని ఆయన అన్నారు.

55
Shantanu Naidu

Shantanu Naidu

ఎవరీ శాంతను నాయుడు?

శాంతను నాయుడు రతన్ టాటా అత్యంత విశ్వసనీయ మేనేజర్లలో ఒకరు. తన వీలునామాలో కూడా శంతను పేరును టాటా పేర్కొన్నారు. టాటా మరణం తర్వాత నాయుడు తన LinkedIn ఖాతాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. “ఈ స్నేహం నాతో వదిలిపెట్టిన లోటును నా జీవితాంతం నింపడానికి ప్రయత్నిస్తాను. దుఃఖం అనేది ప్రేమకు చెల్లించాల్సిన ధర. వీడ్కోలు, నా ప్రియమైన లైట్‌హౌస్," అని ఆయన రాశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Recommended image2
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Recommended image3
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved