MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • National
  • నుదుట విభూతి, చేతిలో జపమాల... కాషాయ వస్త్రాల్లో ప్రధాని మోదీ మహామునిలా దర్శనం

నుదుట విభూతి, చేతిలో జపమాల... కాషాయ వస్త్రాల్లో ప్రధాని మోదీ మహామునిలా దర్శనం

ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ వస్త్రాలు ధరించి నుదిటన విభూతి, చేతిలో జపమాలతో ధ్యానం చేస్తున్నారు. ఈ ద‌ృశ్యాన్ని చూస్తే విశ్వగురు అన్న బిరుదు ఆయనకు సరిపోయినట్లు అనిపిస్తోందని... ఓ మహాముని దేశ శ్రేయస్సుకోసం జపం చేస్తున్నట్లు వుందని బిజెపి శ్రేణులు పేర్కొంటున్నాయి.

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 31 2024, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
PM Modi

PM Modi

కన్యాకుమారి : గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడి నెలకొంది. ఏడు దశల్లో జరిగిన ఎన్నికలు రేపటితో ముగియనున్నాయి... దీంతో లోక్ సభ పోరు ముగుస్తుంది. ఇక కేవలం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మాత్రమే మిగిలివుంటుంది. జూన్ 4న లోక్ సభ ఫలితాలు కూడా రానున్నాయి. ఈ  ఎన్నికల్లోనూ గెలుపుపై బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ధీమాతో వుంది... నరేంద్ర మోదీ కూడా రికార్డులన్నీ బద్దలుగొడుతూ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తాననే నమ్మకంతో వున్నారు. ఈ  క్రమంలోనే ఫలితాలపై ఎలాంటి ఆందోళన లేకుండా నిశ్చింతగా వున్న ఆయన ప్రస్తుతం ఆధ్యాత్మిక బాట పట్టారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
PM Modi

PM Modi

ఏడో దశ ఎన్నికల ప్రచారం కూడా ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆద్యాత్మిక యాత్ర చేపట్టారు. గురువారం సాయంత్రమే కన్యాకుమారి చేరుకున్న ఆయన భగవతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడినుండి వివేకానంద రాక్ మెమోరియల్ కు చేరుకున్నారు. 
 

37
PM Modi

PM Modi

స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోని ప్రధాని మోదీ కూడా ధ్యానం ప్రారంభించారు. ఇలా ధ్యాన మండపంలోనే మే 30 సాయంత్రం నుండి జూన్ 1  సాయంత్రం వరకు అంటే రెండు రోజులపాటు మోదీ ఏకాంతంగా గడపనున్నాను. ఈ రెండ్రోజులు కేవలం ధ్యానం లోనే వుండనున్నారు. 
 

47
PM Modi

PM Modi

గురువారం సాయంత్రం ధ్యానం ప్రారంభించిన మోదీ ఇవాళ(శుక్రవారం) ఉదయం సరికొత్తగా కనిపించారు. పూర్తిగా కాషాయ వస్త్రాలు ధరించి తెల్లవారుజామునే సూర్యనమస్కారం చేసుకున్నారు.  కాస్సేపు ధ్యానమందిరం బయటే జపమాలను చేతిలో పట్టుకుని నడక సాగించారు.  

57
PM Modi

PM Modi

ఇక ప్రధాని ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కాషాయ వస్త్రాలు ధరించి, నుదుట విభూతితో ధ్యానంలో కూర్చున్న మోదీ ఓ మహామునిలా కనిపిస్తున్నాడని ఆయన అభిమానులు, బిజెపి శ్రేణులు అంటున్నారు. ఇలా మోదీని చూసేందుకు రెండుకళ్లు చాలడంలేదంటున్నారు. 
 

67
PM Modi

PM Modi

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట సమయంలోనూ ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించారు.  అప్పుడు కూడా ఆయన పూర్తి ఆద్యాత్మిక చింతనతో గడిపారు. ఇక ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల హడావిడి మొదలవడంతో  మోదీలో పక్కా పాలిటీషన్ ను చూసారు ప్రజలు.  ఈ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్న సమయంలో మరోసారి ప్రధాని ఆద్మాత్మిక బాట పట్టారు.

77
PM Modi

PM Modi

స్వామి వివేకాానంద స్పూర్తితోనే ప్రధాని ధ్యానం చేపట్టినట్లు అర్థమవుతోంది.  వివేకానందుడి మాదిరిగానే పూర్తిగా కాషాయవస్త్రాలు ధరించి ఎంతో నిష్టతో ధ్యానం చేస్తున్నారు. ఇలా ఈ రోజంతా ఆధ్యాత్మిక వాతావరణంలో గడపనున్నారు మోదీ.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగ‌తులు.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image2
మోదీ ప‌ర్య‌ట‌న‌వేళ తీవ్ర క‌ల‌క‌లం.. న‌కిలీ ఐడీ, తుపాకీతో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తులు
Recommended image3
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved