MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ప్రధాని మోదీ ప్రసంగంలోని టాప్ 10 ముఖ్యాంశాలు

ప్రధాని మోదీ ప్రసంగంలోని టాప్ 10 ముఖ్యాంశాలు

PM Modi Speech : జీఎస్టీ 2.0 సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రధాని మోదీ అన్నారు. తన ప్రసంగంలో పన్ను మినహాయింపులు, MSMEలు, స్వదేశీ ఉత్పత్తుల ప్రాముఖ్యతపై కీలక ప్రకటనలు చేశారు. పీఎం మోదీ ప్రసంగంలోని టాప్ 10 పాయింట్లు ఇలా ఉన్నాయి..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 21 2025, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
Image Credit : Asianet News

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

నవరాత్రి వేడుకల ముందు రోజు, రేపటి నుండి అమల్లోకి రానున్న జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ప్రజల పొదుపులు పెంచి, దేశ ఆర్థిక వృద్ధికి కొత్త ఊపు నిచ్చే ఈ సంస్కరణలు దేశ భవిష్యత్తుకు మలుపుతిప్పేలా ఉంటాయని ఆయన అన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

1. నవరాత్రి నుండి ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగు

“రేపటి నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అదే రోజు జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వస్తాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో అడుగు” అని ప్రధాని మోదీ అన్నారు.

2. జీఎస్టీ బచత్ ఉత్సవం ప్రారంభం

“రేపటి నుండి దేశవ్యాప్తంగా జీఎస్టీ బచత్ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఇది పెట్టుబడులు పెంచుతుంది, పొదుపులు పెంచుతుంది, ప్రజల జీవితాల్లో సంతోషం నింపుతుంది” అని ప్రధాని మోదీ చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
3. పెట్టుబడులు, పొదుపులు.. ఆర్థిక వృద్ధికి ఊపు
Image Credit : Getty

3. పెట్టుబడులు, పొదుపులు.. ఆర్థిక వృద్ధికి ఊపు

జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిని వేగవంతం చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. మధ్యతరగతి కుటుంబాలకు ఇది రెట్టింపు లాభమని అన్నారు. పెట్టుబడులు, పొదుపుల్లో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

4. రూ. 2.5 లక్షల కోట్లు ప్రజల పొదుపు

ప్రధాని ప్రకారం, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, జీఎస్టీ 2.0 సంస్కరణలు కలిపి ప్రజలకు సంవత్సరానికి రూ. 2.5 లక్షల కోట్ల పొదుపు కలిగిస్తాయి.

Related Articles

Related image1
హెచ్1బీ వీసా ఎఫెక్ట్ : భారీగా పెరిగిన విమాన ఛార్జీలు.. ఆందోళనలో ఎన్నారైలు
Related image2
ప్రధాని మోదీ ప్రసంగం : పండగ చేసుకోండి
35
5. 2017లో జీఎస్టీ – పన్ను చరిత్రలో మలుపు
Image Credit : Getty

5. 2017లో జీఎస్టీ – పన్ను చరిత్రలో మలుపు

“2017లో జీఎస్టీ ప్రారంభమవడం పాత చరిత్రను మార్చి కొత్త చరిత్ర రాయడం ప్రారంభమైంది. ‘ఒక దేశం – ఒక పన్ను’ అనే కల నెరవేరింది” అని ప్రధాని గుర్తుచేశారు.

6. పన్నుల సంక్లిష్టత నుంచి విముక్తి

ఆక్ట్రోయ్, ఎంట్రీ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ వంటి అనేక పన్నుల గజిబిజి నుండి వినియోగదారులు విముక్తి పొందారని చెప్పారు.

45
7. 2014లో బెంగళూరు–హైదరాబాద్ ఉదాహరణ
Image Credit : Getty

7. 2014లో బెంగళూరు–హైదరాబాద్ ఉదాహరణ

గత పన్నుల గురించి ప్రధాని ఒక ఉదాహరణ ఇచ్చారు.. “ఒక కంపెనీకి బెంగళూరు నుండి హైదరాబాద్‌కు సరుకులు పంపడం అంత కష్టంగా ఉండేది, వారు ముందుగా యూరప్‌కి పంపి, అక్కడి నుండి హైదరాబాద్‌కు పంపితే సులభమని భావించారు. ఆ పరిస్థితి మార్చాము” అని చెప్పారు.

8. వినియోగదారులకు లాభం

రోజువారీ అవసరమైన వస్తువులు పన్ను లేకుండా లేదా కేవలం 5% జీఎస్టీతో అందుబాటులో ఉంటాయని, ఇది మధ్యతరగతి కుటుంబాలకు డబుల్ లాభం అని మోదీ అన్నారు.

55
9. ‘నాగరిక్ దేవో భావ’ ప్రతిబింబం.. స్వదేశీ వస్తువులే వాడాలి
Image Credit : Getty

9. ‘నాగరిక్ దేవో భావ’ ప్రతిబింబం.. స్వదేశీ వస్తువులే వాడాలి

“జీఎస్టీ 2.0 సంస్కరణల్లో ‘నాగరిక్ దేవో భావ’ ప్రతిబింబిస్తోంది. ఈ నిర్ణయాలు ప్రజల సౌలభ్యం, పొదుపుల కోసం” అని ప్రధాని అన్నారు.

10. MSMEలు, స్వదేశీ ఉత్పత్తుల ప్రాముఖ్యత

మోదీ మాట్లాడుతూ, “భారత సుసంపన్నతకు MSME రంగం పునాది. మళ్లీ అదే స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఇల్లు, ప్రతి దుకాణం స్వదేశీ ఉత్పత్తులు వాడాలి. ఉత్పత్తుల నాణ్యతతో భారత్ గర్వపడేలా చేయాలి” అని చెప్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
నరేంద్ర మోదీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Recommended image2
Now Playing
కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu
Recommended image3
Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే
Related Stories
Recommended image1
హెచ్1బీ వీసా ఎఫెక్ట్ : భారీగా పెరిగిన విమాన ఛార్జీలు.. ఆందోళనలో ఎన్నారైలు
Recommended image2
ప్రధాని మోదీ ప్రసంగం : పండగ చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved