MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ప్రధాని మోదీ ప్రసంగం : పండగ చేసుకోండి

ప్రధాని మోదీ ప్రసంగం : పండగ చేసుకోండి

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలు సహా పలు కీలక అంశాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 21 2025, 05:14 PM IST| Updated : Sep 21 2025, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నవరాత్రుల నుంచే జీఎస్టీ ఉత్సవ్
Image Credit : Getty

నవరాత్రుల నుంచే జీఎస్టీ ఉత్సవ్

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన రేపటి నుండి అమల్లోకి రానున్న జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత ఆర్థిక వృద్ధికి కొత్త ఊపు ఇస్తాయని చెప్పారు. సోమవారం నుండి దేశవ్యాప్తంగా ‘జీఎస్టీ బచత్ ఉత్సవం’ ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు.

26
ఆత్మనిర్భర్ భారత్ వైపు మరో అడుగు
Image Credit : Getty

ఆత్మనిర్భర్ భారత్ వైపు మరో అడుగు

పీఎం మోదీ మాట్లాడుతూ, “రేపటి నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఆ రోజుతోనే దేశం ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో పెద్ద అడుగు వేస్తుంది. కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచే అమలులోకి వస్తాయి” అని తెలిపారు. ఈ సంస్కరణలు ప్రజల ఖర్చులను తగ్గించి, పొదుపులను పెంచుతాయని, దీంతో దేశ ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని ఆయన అన్నారు.

Related Articles

Related image1
హెచ్1బీ వీసా ఎఫెక్ట్ : భారీగా పెరిగిన విమాన ఛార్జీలు.. ఆందోళనలో ఎన్నారైలు
Related image2
భారత్ vs పాకిస్తాన్: సూపర్ సండే.. సూర్యకుమార్ కామెంట్స్ వైరల్
36
పెట్టుబడులు పెరుగుదలతో ప్రజల్లో సంతోషం
Image Credit : Getty

పెట్టుబడులు పెరుగుదలతో ప్రజల్లో సంతోషం

ప్రధాని మోదీ తన ప్రసంగంలో “జీఎస్టీ బచత్ ఉత్సవం పెట్టుబడులను పెంచుతుంది. పొదుపులు పెరిగి, ప్రజల జీవితాల్లో సంతోషం నింపుతుంది. ఇవన్నీ కలిపి భారత వృద్ధి కథనాన్ని వేగవంతం చేస్తాయి” అని పేర్కొన్నారు.

46
భారత ఆర్థిక వృద్ధికి ఊతం
Image Credit : Getty

భారత ఆర్థిక వృద్ధికి ఊతం

ఈ సంస్కరణలు కేవలం పన్ను మార్పులు మాత్రమే కాకుండా దేశ ఆర్థిక నిర్మాణానికి కొత్త శక్తి అని ప్రధాని మోదీ అన్నారు. ఉత్పత్తి, వినియోగం, పెట్టుబడుల విభాగాలన్నింటిలోనూ జీఎస్టీ 2.0 ఒక సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు.

56
పన్నుల సంక్లిష్టత నుంచి విముక్తి లభించింది : మోదీ
Image Credit : Getty

పన్నుల సంక్లిష్టత నుంచి విముక్తి లభించింది : మోదీ

“2017లో జీఎస్టీ మొదలైనప్పటి నుండి పన్నుల చరిత్రలో కొత్త అధ్యాయం రాశామని గుర్తుచేశారు. “దశాబ్దాల పాటు మన దేశ ప్రజలు, వ్యాపారులు ఆక్ట్రోయ్, ఎంట్రీ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ వంటి అనేక పన్నుల గజిబిజిలో చిక్కుకున్నారు. ఒక నగరం నుండి మరొక నగరానికి సరుకులు పంపడానికి అనేక చెక్‌పోస్టులు దాటాల్సి వచ్చేది” అని ప్రధాని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ ఒక ఉదాహరణ ప్రస్తావించారు. “2014లో నేను ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే ఒక విదేశీ పత్రికలో ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఒక కంపెనీ బెంగళూరులో నుండి హైదరాబాద్‌కు (570 కి.మీ దూరం) సరుకులు పంపడం కష్టంగా అనిపించడంతో, మొదట యూరప్‌కు పంపి, అక్కడి నుండి హైదరాబాద్‌కు పంపడమే తక్కువ కష్టమని భావించింది. ఇదే పరిస్థితి అప్పట్లో అనేక కంపెనీలు ఎదుర్కొన్నాయి. చివరికి ఈ ఖర్చు పేదలకు, వినియోగదారులపై పడింది” అని అన్నారు.

66
జీఎస్టీ 2.0 వల్ల కలిగే లాభాలు
Image Credit : Getty

జీఎస్టీ 2.0 వల్ల కలిగే లాభాలు

జీఎస్టీ 2.0 వల్ల కలిగే లాభాలను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. “ఇప్పుడు ఈ సంస్కరణల వల్ల వినియోగదారులు క్లిష్టమైన పన్నుల నుండి విముక్తి పొందారు. అవసరమైన రోజువారీ వస్తువులు పన్ను లేకుండా లేదా 5% జీఎస్టీతో అందుబాటులో ఉంటాయి. ఇది మధ్యతరగతికి రెట్టింపు లాభం ఉంటుంది. ధరలు తగ్గుతాయి, పొదుపులు పెరుగుతాయి. పెట్టుబడులు పెరిగి ప్రజల జీవితాల్లో సంతోషం నిండుతుంది. ఇవన్నీ కలిపి భారత వృద్ధిని మరింత వేగవంతం చేస్తాయి” అని చెప్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
నరేంద్ర మోదీ
భారత దేశం
వ్యాపారం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
డొనాల్డ్ ట్రంప్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved